బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా కు కోప‌మొచ్చింది. సోష‌ల్ మీడియాలో త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌ప్పికొట్టింది. క‌రోనా క‌ట్ట‌డికి త‌న‌ వంతుగా విరాళాలు ఇవ్వ‌డంలేద‌న్నఆరోప‌ణ‌ల‌పై తీవ్రంగా స్పందించారు. నెటిజన్ల ట్రోల్స్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.  ‘కొంత మంది మంచి పని చేసి చెప్పుకుంటారు. మరికొంత మంది చెప్పుకోడానికి ఇష్టపడరు. నేను రెండో సిద్ధాంతాన్ని పాటిస్తాను. నన్ను ట్రోల్స్‌ చేసే వారికి ఒక నిమిషం మౌనం పాటిస్తున్నా. ఆపద సమయంలో ఇలాంటి ట్రోల్స్‌ చేయడం కంటే.. మీ సమయాన్ని మంచి పని చేయడం కోసం ఉపయోగించండి. విరాళం ప్రక టించడం అనే అంశం నా వ్యతిగత విషయం.’’ అంటూ బదులిచ్చారు బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా ..

భార‌త్‌లో క‌రోనా చాప‌కింద నీరులా విస్త‌రిస్తున్న‌ది. కరోనా సంక్షోభంలో చిక్కకున్న భారత్‌ను ఆదుకునేందుకు త‌మ వంతు సాయంగా సెలబ్రిటీలు భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. రాజ కీయ, వ్యాపార, సినిమా, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు అందజేస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నా రు. ఈక్రమంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి విరాళాన్ని ప్రకటించలేదని.. నెటిజన్లు మండిప‌డుతున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో సోనాక్షిని టార్గెట్‌ చేస్తూ విరుచుకుపడుతున్నారు.   అంతేగాక సోనాక్షి కోస్టార్స్‌ అందరూ పీఎం సహాయనిధికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేస్తూంటే.. ఆమె మాత్రం అసలు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారని సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు. 

అయితే తాజాగా సోష‌ల్ మీడియాలో త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారంపై సోనాక్షి స్పందించారు. తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన‌ సోనాక్షి నెటిజన్ల ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.  ఈమేరకు ఆమె ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే అంత కంటే ముందు బాలివుడ్ మెగాస్టార్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌పై కూడా నెటిజ‌న్లు విమర్శలు గుప్పించారు.  దీనిపై  స్పందించిన అమితాబ్‌.. ట్విటర్‌ ద్వారా తనపై వచ్చిన ట్రోల్స్‌ను తిప్పికొట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: