సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రతి రోజూ పండగే. అవుట్ అండ్ అవుట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సూపర్‌ హిట్ కావటంతో మారుతి రేంజ్ పెరిగింది. ప్రస్తుతం యంగ్ జనరేషన్ హీరోలందరూ మారుతితో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే మారుతి మాత్రం ఇప్పటికే ఓ యంగ్ హీరోకు కమిట్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

 

చాాలా కాలంగా సాలిడ్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో రామ్‌ ఇటీవల ట్రాక్ లోకి వచ్చాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు రామ్‌. ఇస్మార్ట్‌ శంకర్‌ తరువాత రామ్‌ కు వరుస అవకాశాలు తలుపు తట్టాయి. కానీ రామ్‌ మాత్రం సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్‌తో వచ్చిన మాస్‌ ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం రెడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

 

ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకుడు. రామ్ కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్ నేను శైలజతో పాటు హలో గురూ ప్రేమ కోసమే సినిమాలను తెరకెక్కించాడు కిశోర్‌. రెడ్ వీరి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. వరుసగా రెండు మాస్ సినిమాలు చేయటంతో తదుపరి చిత్రాన్ని డిఫరెంట్ గా చేయాలని భావిస్తున్నాడట రామ్‌.

 

ఈ సినిమాలో అందుకే ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న కామెడీ డైరెక్టర్‌ మారుతి దర్శకత్వంలో  ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మారుతి మార్క్ కామెడీ హైలెట్‌ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రెడ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న రామ్, కరోనా ఎఫెక్ట్‌ పూర్తయిన తరువాత నెక్ట్స్ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: