మెగా హీరో సాయి తేజ్ చిత్రలహరి ముందు వరకు ఆరు వరుస ఫ్లాపులతో డీలా పడిన విషయం మనకు తెలిసిందే. చిత్రలహరితో మళ్ళీ చిత్ర ట్రాక్ ఎక్కగా ప్రతిరోజూ పండుగే అతనికి సూపర్ హిట్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం నూతన దర్శకుడు సుబ్బు డైరక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు సాయి తేజ్. ఈ సినిమాను మేలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలాఉంటే ఈ మూవీ తర్వాత సాయి తేజ్ దేవా కట్టా డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. 

 

ఈమధ్యనే మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగాల్సి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చి ఈ సినిమాకు ముహూర్తం పెట్టారు. ఈ మూవీలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా వస్తుందట. సినిమాలో సీఎం పాత్రలో శివగామి రమ్యకృష్ణ నటిస్తుందని తెలుస్తుంది. ఆ సీఎంతోనే హీరో ఢీ కొడతాడని తెలుస్తుంది ప్రస్థానం సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న దేవా కట్టా సాయి తేజ్ తో కూడా మరో క్రేజీ మూవీ చేస్తున్నాడు.

 

సాయి తేజ్ సరసన నటిస్తున్న నివేదా పేతురాజ్ కూడా లక్కీ హ్యాండ్ అని చెప్పొచ్చు. మెంటల్ మదిలో సినిమాతో తెలుగులో నటిస్తున్న ఈ అమ్మడు చేసిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. సాయి తేజ్ చిత్రలహరిలో కూడా ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించింది. మరి మెగా హీరో సినిమాతో హిట్ కొడితే ఆ లెక్క వేరేగా ఉంటుంది. మరి అమ్మడి లాక్ ఫెవర్ సాయి తేజ్ కు ఏమాత్రం కలిసి వస్తుందో చూడాలి. సాయి తేజ్ మాత్రం దేవా కట్ట చెప్పిన కథపై చాలా హోప్స్ తో ఉన్నాడని తెలుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: