గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 5 నెలల క్రితం రామ్ గోపాల్ వర్మ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. రామ్ గోపాల్ వర్మ మెగా ఫ్యామిలీ సినిమా తీస్తానని చెప్పి మళ్లీ వెనక్కి ఎందుకు తగ్గాడో చెప్పమనండి అంటూ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఆర్జీవిని అడిగిన సంగతి తెలిసిందే. దాంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొన్ని రోజుల పాటు కొనసాగింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు సద్దుమణిగాయి. అయితే తాజాగా మళ్లీ వీరిద్దరి విషయం తెరపైకి వచ్చింది.

పూర్తి వివరాలు తెలుసుకుంటే... సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్జీవి బయోపిక్ తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు. తాజాగా ఆయన మాట్లాడుతూ... RGv.. రోజూ గిల్లే వాడు అనే టైటిల్ తో రామ్ గోపాల్ వర్మ యొక్క బయోపిక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని... లాక్ డౌన్ ఎత్తేసిన అనంతరం ఈ బయోపిక్ చిత్రీకరణ మొదలవుతుందని, ఇప్పటికే వర్మ లాగా కనిపించే ఒక వ్యక్తి దొరికాడని,  'తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు' తన యువతను చెడ్డ దారి పట్టిస్తున్న ఒక రామ్ గోపాల్ వర్మ ఫిలాసోఫి మీద సంధించిన రామబాణమే ఈ చిత్రమని... దీని కారణంగానే శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా శీర్షిక లోగో ని రిలీజ్ చేసామని ఆయన అన్నారు.


సమాజాన్ని తన మహా చెడ్డ భావాలతో ఎలా కలుషితం చేస్తున్నారో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించనున్నామని ఈ చిత్ర సమర్పకుడు బొగ్గారం వెంకట శ్రీనివాస్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇకపోతే కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన ఈ సమయంలో... రామ్ గోపాల్ వర్మ కి చాలా ఖాళీ టైం దొరికింది అని తెలుస్తోంది. అందుకు గాను ఆయన సోషల్ మీడియాలో తాజా పోస్టులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కరోనా పురుగు అంటూ తానే ఒక కొత్త పాటని రూపొందించాడు. మరి ఇంతగా ఖాళీ టైం దొరుకుతున్న వేళ రామ్ గోపాల్ వర్మ... జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు తీయనున్న RGv.. రోజూ గిల్లే వాడు అనే బయోపిక్ పై కచ్చితంగా వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: