సాహో వంటి భారీ డిజాస్టర్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డేలు హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి 'జాన్', 'ఓ డియర్' ,'రాధే శ్యామ్' అన్న టైటిల్స్ ప్రచారం లో ఉన్నాయి. అయితే వీటిల్లో ఏది ఫైనల్ చేస్తారో ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఇక ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా 'జిల్' సినిమా ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి అన్నీ అవాంతరాలే ఎదురవుతు ఎప్పుడో కంప్లీటవ్వాల్సిన చిత్రీకరణ ఇంకా ఒక కొలిక్కి రానేలేదు.  

 

కొన్నాళ్ళు పూజా హెగ్డే కి ఆరోగ్యం సహకరించకపోవడం తో షెడ్యూల్ కి బ్రేక్ పడింది. ఇప్పుడేమో కరోనా మహమ్మారితో నిలిపివేశారు. సాహో మీద భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికి భారీ ఫ్లాప్ గా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమాని అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకొని తెరకెక్కిస్తున్నారు. కథ లో కాడా కొన్ని మార్పులు చేర్పులు చేసి  షూటింగ్ మొదలు పెడితే కరోనా కారణంగా విదేశాల కు వెళ్ళిన ప్రభాస్ టీం తిరిగి వెనక్కి వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను జార్జియాలో మార్కెట్ సెట్ వేసి చిత్రీకరించి కరోనా నేపథ్యంలో మధ్యలోనే షూటింగ్ ఆపేసి ఇండియాకి తిరిగి వచ్చారు. 

 

ఇక ఈ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు పండగలా ఉండబోతుందని పూజ హెగ్డే తెలిపింది. ప్రభాస్ ని ఇంతవరకు చూడని స్టైల్ తో - చాలా కొత్తగా, స్టైలిష్ గా ఈ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ చూపిస్తున్నాడని పూజా వెల్లడించింది. ఇక త్వరలో తెరకెక్కించనున్న షెడ్యూల్ లో ప్రభాస్ తో నేను చేయబోయో రొమాన్స్ ని షూట్ చేయనున్నారని సినిమా అప్డేట్స్ ని వెల్లడించింది. అంతేకాదు ప్రభాస్ తో రొమాన్స్ కి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటు వెల్లడించింది. అంతేకాదు నేనే కాదు ప్రభాస్ లాంటి హ్యాడ్సం హీరో తో రొమాన్స్ అంటే ఏ హీరోయిన్ కైనా క్యూరియాసిటిగానే ఉంటుందని వగలుబోతోంది. అయితే నువ్విలా మాట్లాడితే అనుష్క హర్ట్ అవుతుందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: