యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి 'జాన్' అని చిత్ర బృందం ముందునుంచి ప్రచారం చేసినప్పటికి ఆ తర్వాత ఈ సినిమా టైటిల్ అది కాదంటు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 'ఓ డియర్' 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ అనుకుంటున్నట్టు ఈ రెండిటిల్లో ఒకటి ఫైనల్ చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా 'జిల్' సినిమా ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాని ఏ ముహూర్తానా మొదలు పెట్టారో గాని అన్నీ సమస్యలే ఎదురవుతున్నాయి. సక్రమంగా షూటింగ్ జరిగింది లేదు. 

 

కొన్నాళ్ళు పూజా హెగ్డే మూలాన షూటింగ్ కి బ్రేక్ పడితే ఇప్పుడు కరోనా కారణంగా బ్రేక్ పడింది. సాహో అనుకున్నట్టుగా సక్సస్ కాకపోవడంతో ఈ సినిమాని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని తెరకెక్కిస్తున్నారు. ముందు అనుకున్న కథ కాకుండా మళ్ళీ కొత్తగా కథ మొత్తం మార్చేసి కొంత గ్యాప్ తర్వాత షూటింగ్ మొదలు పెడితే కరోనా కారణంగా విదేశాల కు వెళ్ళిన ప్రభాస్ టీం తిరిగి వెనక్కి రావలసి వచ్చింది. ముందు యూరోప్ అనుకున్నప్పటికి ఆ తర్వాత జార్జియా కి వెళ్లారు. ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను జార్జియాలో మార్కెట్ సెట్ వేసి చిత్రీకరించి కరోనా నేపథ్యంలో మధ్యలోనే షూటింగ్ ఆపేసి ఇండియాకి తిరిగి వచ్చారు. ఇక ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ చేయాలంటే అయ్యోపని కాదని అర్థమైపోయింది. 

 

దీంతో ఈ సినిమాని ఇక్కడే ఈ సినిమాకి సంబంధించిన టాక్ పార్ట్ కంప్లీట్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఇక కరోనా నేపథ్యంలో పెద్ద సినిమాలు విడుదల వాయిదా వేసుకుంటున్నందువల్ల దసరాకి ఈ సినిమా రిలీజయ్యో అవకాశాలు లేవని అంటున్నారు. అయితే బాహుబలి సినిమాతో ఎంతో కష్టపడి సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ అండ్ మార్కెట్ కాపాడుకోవాలంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రభాస్సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకోవాల్సిందే అని ప్రభాస్ ప్లాన్స్ వేసుకుంటున్నాడట. అయితే ఇప్పటికే ఈ కథ చాలామందికి తెలిసిందని అంటున్నారు. ఒకవేళ కథ ప్రేక్షకుల అంచనాలకి తగ్గట్టుగా లేకపోతే జాన్ మరో సాహో లా ఫ్లాప్ అయ్యో ఛాన్స్ ఉందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: