ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమ ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటి కేజీఎఫ్: చాప్టర్2 అనడంలో సందేహం లేదు. రెండేళ్ల క్రితం విడుదలైన కేజీఎఫ్ చాప్టర్1 సినిమా ఏస్థాయిలో హిట్ అయిందో తెలిసిన విషయమే. సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. ఈ సినిమాతో హీరో యాశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇండియా వైడ్ గా పాపులర్ అయిపోయారు. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ కావడంతో కేజీఎఫ్ చాప్టర్2 ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

 

 

ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ లేడీ విలన్ పాత్ర ఉందట. ఈ రోల్ కి బాలీవుడ్ నుంచి మాజీ టాప్ హీరోయిన్ రవీనాటాండన్ ను తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడీ వార్త నిజమేనని సాక్షాత్తూ రవీనాటాండనే స్పష్టం చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్లతో జరిగిన లైవ్ చాట్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కేజీఎఫ్ చాప్టర్2లో రమికా సేన్ గా ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. ఈ పాత్రలో ఎన్నో షేడ్స్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాను. సినిమా విడుదలయ్యాక నా పాత్ర ఎంత ఆసక్తికరంగా ఉంటుందో చూస్తారు అని తెలిపింది.

 

 

ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కు గ్యాప్ వచ్చింది. పరిస్థితులు అనుకూలించాక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా హిందీ అగ్ర హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడు. అన్ని అనుకూలిస్తే ఈ ఏడాదే విడుదల కావల్సి ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో వస్తుందని అంటున్నారు. దీనిపై యూనిట్ నుంచి అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: