పూజ హెగ్డే, ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో విపరీతంగా మారుమ్రోగుతోంది. అయితే దానికి ప్రధాన కారణం, ఇటీవల పూజా నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా సూపర్ హిట్స్ కొడుతుండడమే అని చెప్పాలి. ముందుగా నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజ, ఆ తరువాత ముకుంద, డీజే సినిమాల్లో నటించి తన అందం అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసుని గెలుచుకుంది. అయితే మొదటగా ఆమెకు కమర్షియల్ సక్సెస్ ని అందించింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో వచ్చిన అరవింద సమేత సినిమానే అని చెప్పాలి. 

 

2018లో సూపర్ హిట్ కొట్టిన ఆ సినిమా తరువాత పూజ సూపర్ స్టార్ మహేష్ సరసన నటించిన మహర్షి, అలానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలసి జతకట్టిన గద్దలకొండ గణేష్ సినిమాలతో మరొక రెండు సూపర్ హిట్స్ అందుకుంది. ఇక ఇటీవల బన్నీ, త్రివిక్రమ్ ల కలయికలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో మరొక సూపర్ హిట్ కొట్టిన పూజాకు ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా భారీగా ఆఫర్లు వస్తున్నాయి. ఇక మిగతా హీరోయిన్ల మాదిరిగా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ తో ఎక్కువగా టచ్ లో ఉండే పూజా, నిన్న రాత్రి ఫ్యాన్స్ తో కలిసి ట్విట్టర్ లో ఆస్క్ పూజ పేరిట ఒక క్వశ్చన్స్ సెషన్ నిర్వహించింది. 

 

అందులో భాగంగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన పూజా, తనకు చాకోలెట్స్ అంటే ఎంతో ఇష్టం అని, ఒకవేళ తాను యాక్టర్ ని కాకపోతే ఫోటోగ్రాఫర్ ని అయి ఉండేదానినని చెప్పుకొచ్చింది. ఇక ఆ సెషన్ లో భాగంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పై అలానే తెలుగు ప్రేక్షకుల పై మీ అభిప్రాయం చెప్పండి అని ఒక అభిమాని ప్రశ్నకు ఆమె నిజంగా దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిందని చెప్పాలి. అవును నాకు తెలుగు సినిమాలంటే ఎంతో ఇష్టం, ఇక తెలుగు ప్రేక్షకులు తనకు జీవితం అంటూ లవ్ ఎమోజీని కూడా పోస్ట్ చేస్తూ రిప్లై ఇచ్చింది. ఇక ఆమె రిప్లై కు మురిసిపోయిన మన ప్రేక్షకులు, మేడమ్ మీరు తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కూడా యాక్ట్ చేస్తున్నప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకుల అంటే నా జీవితం అని చెప్పడం నిజంగా ఎంతో సంతోషం అంటూ ఆమెపై పలువిధాలుగా పొగడ్తలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు....!!  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: