వరుస పరాజయాల తరువాత ఎట్టకేలకు ఇటీవల భీష్మ తో హిట్ కొట్టి ట్రాక్ లో కి వచ్చాడు యంగ్ హీరో నితిన్.  ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక ఈ చిత్రం తరువాత నితిన్ ,రంగ్ దే తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరక్కుతున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది. ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదలైంది.
 
ఇక ఈ సినిమా శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను జీ నెట్వర్క్ (జీ తెలుగు &జీ 5) దక్కించుకుంది. ఈ డీల్ విలువ 10కోట్లని సమాచారం. ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా నితిన్ -కీర్తి కలిసి నటించడం ఇదే మొదటి సారి. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై లో విడుదలకానుంది. ఈ సినిమా తోపాటు నితిన్ ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి  డైరెక్షన్ లో చెక్ (వర్కింగ్ టైటిల్ ) లో కూడా నటిస్తున్నాడు.
 
ఇటీవలే రెండు షెడ్యూల్ లు కూడా పూర్తి చేసుకుంది.  ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తుండగా నితిన్ ఖైదీ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలే కాగా ఇటీవల నితిన్ మరో  సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో భాగంగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధధూన్ రీమేక్ లో నటించనున్నాడు. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: