టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే స్టార్ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకువెళ్తుంది. అల్లు అర్జున్ తో నటించిన డీజే నుండి అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో వరకు ఆమె ఖాతాలో అన్నీ బ్లాక్ బస్టర్సే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ డియర్ అనే చిత్రంలో నటిస్తుంది. స్టార్ హీరోల సరసన నటించడానికి ఏకైక ఛాయిస్ గా మారిన పూజాకి తెలుగులో మంచి డిమాండ్ ఉంది. 

 

ఓ డియర్ సినిమా షూటింగ్ నిమిత్తం జార్జియా వెళ్ళి కరోనా కారణంగా ఇండియాకి తిర్గి వచ్చిన పూజా హెగ్డే లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమె సొషల్ మీడియాలో అభిమానుల ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చింది. తెలుగులో సూపర్ హిట్లు దక్కించుకున్న పూజాకి ఓ అభిమాని తెలుగు ప్రేక్షకుల గురించి మీరేం ఫీల్ అవుతున్నారని అడగ్గా.. దానికి ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.

 


తెలుగు ప్రేక్షకులు నా జీవితం అంటూ ఆమె సమాధానం ఇచ్చింది. ముకుంద సినిమా నుండి ఇప్పటి వరకు తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులు నాకు జీవితాన్నిచ్చారన్న కారణంగా ఆమె వాళ్లే నా జీవితం అంటూ కామెంట్ చేసింది. బాలీవుడ్ లో సైతం అవకాశాలు దక్కించుకుంటున్న పూజా తెలుగు ప్రేక్షకులకి అంత మంచి స్థానాన్ని ఇవ్వడం నిజంగా షాకింగే.. చాలా మంది హీరోయిన్లు నటించామా.. డబ్బులు సంపాదించుకున్నామా అన్న విధంగా ఉంటారు తప్పితే తెలుగు ప్రేక్షకులకి అంతటి స్థానాన్ని ఇవ్వరు. 

 


అదే కాదు బాలీవుడ్ లో అవకాశం రాగానే మళ్ళీ తెలుగులో నటించడానికి ఇష్టపడరు కూడా.. కానీ అటు బాలీవుడ్ లొ అవకాశాలు వస్తున్నా తెలుగులోనూ నటిస్తున్న పూజాకి నిజంగా తెలుగు ప్రేక్షకులంటే మంచి గౌరవం ఉందని అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: