యువ హీరో భీష్మ సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న నితిన్ ఫైనల్ గా మళ్ళీ వెంకీ కుడుములు డైరక్షన్ లో వచ్చిన భీష్మాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు నితిన్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీమూవీ నిర్మిస్తున్నారు. '

రీసెంట్ గా సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నితిన్, కీర్తి సురేష్ ల ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా నుండి కనీసం టీజర్ కూడా రిలీజ్ కాకుండానే శాటిలైట్, డిజిటల్ రైట్స్ బిజినెస్ క్లోజ్ అవడం విశేషం. జీ తెలుగు, జీ 5 రెండిటిని కైవసం చేసుకుందని తెలుస్తుంది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ 10 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. నితిన్ సినిమా రిలీజ్ కు ముందే నిర్మాతలకు 10 కోట్లు తెచ్చిపెట్టింది. నితిన్ కెరియర్ లో ఇదే హయ్యెస్ట్ శాటిలైట్ బిజినస్ చేసిన సినిమా అని చెప్పొచ్చు.

 

నితిన్ తో కీర్తి సురేష్ మొదట జోడీ కడుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా తప్పకుండా ఆ అంచనాలను అందుకుంటుందని అంటున్నారు. తొలిప్రేమతో హిట్ అందుకున్న డైరక్టర్ వెంకీ అట్లూరి తన సెకండ్ మూవీ మిస్టర్ మజ్నుతో నిరాశ పరచాడు. అందుకే నితిన్ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు వెంకీ అట్లూరి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. కీర్తి సురేష్ కూడా ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: