పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ  ఇస్తున్నాడని తెలిసినప్పటి నుండి రోజుకో వార్త వస్తుంది. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ సినిమా తెలుగు రీమేక్ వకీల్ సాబ్ లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ వరుసగా మరో రెండు చిత్రాలని లైన్లో పెట్టాడు. వకీల్ సాబ్ చిత్రానికి వేను శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం దిల్ రాజు పవన్ కళ్యాణ్ కి భారీ పారొతోషికం ఇస్తున్నట్టు సమాచారం.

 

అయితే ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే పవన్- క్రిష్ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అయింది. పవన్ కళ్యాన్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన కల్యాణ్ బందిపోటుగా కనిపిస్తాడట. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మనల్ని ఔరంగజేబు కాలానికి తీసుకెళ్తుందట. అటు వకీల్ సాన్ లోనూ, ఇటు క్రిష్ సినిమాలోనూ నటిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఖాళీగా ఉన్నాడు.

 

షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ కావడంతో ఇంటివద్దే ఉండి కరోనాపై పోరాడుతున్న ప్రభుత్వానికి తన వంతు సాయం చేస్తున్నారు. అయితే పవన్- క్రిష్ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలు అంత త్వరగా రిలీజ్ అవ్వవు. సంవత్సరానికి ఒక సినిమా కూడా రిలీజ్ చేయని కళ్యాణ్ ఈ సారి ఏకంగా రెండు మూడు చిత్రాలను ఒప్పుకోవడం షాకింగే..

 

అయితే సినిమాలు ఒప్పుకోవడమే కాదు.. వాటి రిలీజ్ కూడా చాలా త్వరగానే ఉంటుందట. వకీల్ సాబ్ రిలీజ్ అయిన నెలలోపే పవన్ క్రిష్ సినిమా కూడా రిలీజ్ కానుందట. అంటే పవన్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ అన్నమాట. ప్రస్తుతం కరోనా వల్ల ఆగిపోయిన షూటింగ్స్ మళ్లి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు..కాబట్టి ఈ సినిమాలు ఎప్పుడు రిలీజవుతాయో చెప్పలేం..

మరింత సమాచారం తెలుసుకోండి: