వరుస పరజయాల తరువాత హిట్ ట్రాక్లోకి వచ్చిన యంగ్ హీరో నితిన్ తాజాగా భీష్మా సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నితిన్కు జోడిగా రష్మిక మందన్న నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో నితిన్ తదుపరి చిత్రాల మీద కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకే రిలీజ్కు ముందే నితిన్ సినిమాలకు భారీ గా బిజినెస్ చేస్తున్నాయి.
భీష్మా సెట్స్ మీద ఉండగానే వెంకీ అట్లూరి దర్శత్వంలో రంగ్ దే సినిమాను ప్రారంభించాడు నితిన్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్. నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా ప్రారంభించారు. నితిన్ గత చిత్రం ఘన విజయం కావటంతో తాజా చిత్రాన్నికి శాటిలైట్, డిజిటల్ రైట్స్ భారీ ధర పలికినట్టుగా తెలుస్తోంది.
శాటిలైట్ తో డిజిటల్ రైట్స్ రెండూ జీ సంస్థ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు, డిజిటల్ రైట్స్ ను జీ 5 సంస్థలకు దాదాపు 10 కోట్లకు అమ్మినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీ సీ శ్రీరామ్ సినిటోగ్రఫీ అందిస్తున్నారు. దర్శకుడు వెంకీ తెరకెక్కిన తొలి ప్రేమ సినిమా సూపర్ హిట్ అఖిల్ హీరోగా తెరకెక్కించిన మిస్టర్ మజ్నుకు కూడా మంచి రెస్పాన్స్ రావటంతో ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది.
ఈ సినిమా తరువాత చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత బాలీవుడ్ సూపర్ హిట్ అంధదూన్ రీమేక్ లో నటించనున్నాడు.