టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి2’ తర్వాత ఒక ఏడాది గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఏడాది నుంచి ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా ఎన్నో ఫేక్ కథనాలు, వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఉగాది పండుగ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ మోషన్ లోగో రిలీజ్ చేశారు. ఆర్ఆర్ఆర్ అంటే రౌద్రం రణం రుధిరం అని మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో గ్రాఫిక్స్ మాయాజాలం ఎంతో గొప్పగా కనిపించింది.
ప్రేక్షకుల్లో సస్పెన్స్ కు తెరదించిన రాజమౌళి... టైటిల్ పై ఎంతో మంది పాజిటివ్ కామెంట్లు వచ్చాయి. ఆ తర్వాత రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధిన ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో రామ్ చరణ్ పవర్ ఫుట్ ఫైట్స్... ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో దుమ్మురేపారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు తెరకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మూవీలో రామ్ చరణ్ తండ్రిగా అజయ్ నటిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇందులో ఎంత నిజం ఉందనే దానిపై క్లారిటీ లేదు. ఈ రోజు అజయ్ దేవగణ్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ వీడియో అవుతుందని అభిమానులు భావించారు.
కాని కరోనా క్రైసిస్ కారణంగా టీం అందరు ఇంటికే పరిమితం కావడంతో డీఐ, మ్యాజిక్ పూర్తి కాలేదు. దీంతో అజయ్ దేవగణ్కి సంబంధించిన వీడియో వాయిదా పడింది. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత లాక్ డౌన్ పూర్తిగా ఎత్తి వేసిన తర్వాత మళ్లీ లైన్లోకి వస్తారని తెలుస్తుంది. లాక్ డౌన్ తర్వాత తప్పక విడుదల చేస్తామని అంటుంది ఆర్ఆర్ఆర్ టీం.ఇప్పటికే చిత్ర బృందంతో కలిసి కొంత షూటింగ్ చేసిన అజయ్ దేవగణ్ తర్వాతి షెడ్యూల్లోను జాయిన్ కానున్నాడు. రౌద్రం రణం రధిరం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానున్న సంగతి తెలిసిందే