గత సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్నాడు టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఒకే చెప్పాడు. సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్‌ సందర్భంగా వంశీతో నెక్ట్స్ సినిమా అంటూ ప్రకటించాడు కూడా. అయితే సినిమా రిలీజ్ తరువాత సీన్ మారిపోయింది. వంశీ పైడిపల్లి సినిమాను పక్కన పెట్టేశాడు మహేష్. ఆ ప్లేస్‌ చాలా కాలంగా పెండింగ్‌ ఉన్న పరశురాం సినిమా లైన్‌లోకి వచ్చింది.

 

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా దాదాపుగా ఓకే అయిపోయినట్టే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, ఎమ్బీఈ సినిమాస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. అయితే ఈ సినిమా లాభాల్లో మాత్రం ఈ ముగ్గరితో పాటు కొరటాల శివ కూడా వాటా తీసుకోనున్నాడట. పరశురామ్ ను మహేష్ కు పరిచయం చేసింది కొరటాలనే, అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే తనకు కూడా వాటా ఇవ్వాలని కొరాటాల నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నాడట.

 

అయితే తాజాగా నిర్మాతలు కొరటాల విషయంలో ఆలోచనలో పడ్డారట. ఇప్పటికే ముగ్గురు భాగస్వాములు కావటంతో పెద్దగా లాభాలు ఉండవని భావిస్తున్నారు. ఒక వేళ కొరటాల జాయిన్‌ అయితే లాభం మరింతగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారట. ముఖ్యంగా 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు కొరటాల భాగస్వామ్యం విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌  వస్తుందా లేదా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సరిలేరు నీకెవ్వరు తరువాత విదేశాలకు వెళ్లిన మహేష్ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. తరువాత కరోనా ఎఫెక్ట్ తో సినిమా కార్యక్రమాలు ఆగిపోవటంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: