మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ మూవీస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. ఇక ఈ సినిమాలో చరణ్ కూడా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2021 సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మొదట త్రిష హీరోయిన్ గా ఎంపిక చేయగా ఎందుకో ఆమె ఆ సినిమా నుండి బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు సినిమా నుండి మరో టెక్నీషియన్ బయటకు వెళ్లినట్టు తెలుస్తుంది. 

 

సినిమా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ చిరంజీవి ఆచార్య నుండి ఎగ్జిట్ అయ్యాడని తెలుస్తుంది. సినిమా షెడ్యూల్ అనుకున్న విధంగా జరగకపోవడంతో పాటుగా అతనికి వేరే ప్రాజెక్టులు ఉన్నందు వల్ల చిరు సినిమా నుండి ఎగజిట్ అయ్యాడట శ్రీకర్ ప్రసాద్. ఈమధ్యనే లిమ్కా బుక్ లోకి ఎక్కినా శ్రీకర్ ప్రసాద్ మెగా మూవీ నుండి ఎగ్జిట్ అవడం ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది. అతని ప్లేస్ లో నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తాడని తెలుస్తుంది.

 

ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ సినిమాతో సెన్సేషనల్ హతి అందుకున్నాడు. ఆ తర్వాత సైరా సినిమాతో కూడా చిరు తన సత్తా చాటాడు. ఆచార్యతో మరోసారి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ సినిమాతో వస్తున్నాడు చిరంజీవి. చేసేది భారీ బడ్జెట్ సినిమాలే కానీ అందులో మంచి సోషల్ మెసేజ్ ఉండేలా జాగ్రత్త పడే కొరటాలా శివ చిరు సినిమాను అంచనాలను అందుకునేలా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఈ సినిమా విషయంలో జరుగుతున్నా ఈ ఇన్ అండ్ అవుట్ లు సినిమా రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటె బెటర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: