సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఒక మాస్ క్యారెక్టర్ ని చేసి ఫ్యాన్స్ కోరికని తీర్చారని అందరూ అన్నారు. ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా ఉంటుందని సరిలేరు సెట్స్ మీద ఉన్నప్పటి నుంచే ప్రచారం జరిగింది. ప్రేక్షకులు కూడా ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఫిక్సైపోయారు. కాని కొన్ని క్రియోటివ్ డిఫ్రెన్సెస్ వల్ల మొతానికి ప్రాజెక్టే ఆగిపోయింది.

 

దాంతో ఆయన నెక్స్ట్ సినిమా క్లాస్ డైరక్టర్ పరుశురామ్ తో అయిపోయింది. ఈ సినిమాని మైత్రీ మూవీస్, 14రీల్స్ ప్లస్, జిఎమ్బి సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. అయితే సినిమాలో వచ్చే లాభాలు మాత్రం నలుగు పంచుకోవాలని ఒప్పందం అని తెలిసింది. మూడు నిర్మాణ సంస్థల తో పాటు మరో దర్శకుడు ఉన్నాడని అంటున్నారు.  వాస్తవంగా ఈ ప్రాజెక్టు సెట్ చేయడంలో దర్శకుడు కొరటాల శివ ది ముఖ్య పాత్ర ఉందని బిగినింగ్ నుంచి చెబుతున్నారు. దాంతో కొరటాలకి కూడా ఈ సినిమా లాభాల్లో వాటా వుందని చెబుతున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న కొత్త న్యూస్ ఏమిటంటే ఈ సినిమా లాభాలల్లో 25 శాతం లాభం మహేష్ కు, మిగిలిన సగం మైత్రీ, సగం 14రీల్స్ ప్లస్ కు అని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.

 

దాంతో ఇప్పుడు కొరటాల శివ సంగతేమిటన్నది కన్‌ఫ్యూజన్ గా మారిందట. ఎందుకంటే పరుశురామ్ ను మహేష్ బాబును కలిపి ప్రాజెక్ట్ సెట్ చేసింది కొరటాల నే. ఒకవేళ  ప్రాజెక్టు సెట్ అయితే తనకు వాటా వుండాలని ఆయన మైత్రీ తో ఒప్పందం చేసుకున్నారట. అయితే ఇప్పుడు నిర్మాతలు సూపర్ స్టార్ తో సినిమా చేయాలన్న యాంబీషన్ తప్ప లాభాలు ఎంత వస్తాయన్న గ్యారెంటీ లేకపోవడంతో వాటి గురించి ఆలోచించడం లేదని కొరటాలకి షాకిచ్చినట్టు తెలుస్తుంది. దాంతో కొరటలా బాబు నన్ను వదిలేస్తారా అంటూ చూస్తున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: