దాదాపు నాలుగేళ్ళుగా వరుసగా ఫ్లాప్స్ తో సతమయ్యాడు. త్రివిక్రం శ్రీనివాస్ తో అ..ఆ తీసి నాలుగు సంవత్సరాలైంది. అదే ఈ కుర్ర హీరోకి లాస్ట్ హిట్ సినిమా. ఆ తర్వాత అన్ని ఫ్లాపులే. దాంతో ఈ యంగ్ హీరో కాస్త గ్యాప్ తీసుకొని భీష్మ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. రిలీజ్ కి ముందే 10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ ని సాధించిన భీష్మ నితిన్ కి మళ్ళీ క్రేజ్ ని తీసుకు వచ్చింది. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నితిన్‌కు జోడిగా రష్మిక మందన్న నటించింది. ఈ సినిమా సూపర్‌ హిట్ కావటంతో నితిన్‌ మళ్ళీ ఫాం లోకి వచ్చి తన నెక్స్ట్ సినిమాల మీద అంచనాలు మొదలయ్యాయి.

 

భీష్మ సెట్స్ మీద ఉండగానే వెంకీ అట్లూరి దర్శత్వంలో రంగ్ దే సినిమాను సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు నితిన్‌. చక చకా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో బ్రేక్ ఇచ్చారు. ఇక కీర్తి సురేష్ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను రీసెంట్ గా ప్రారంభించారు. నితిన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అయితే పోస్టర్ లో మంచి రొమాంటిక్ ఫీల్ కనిపిస్తున్నప్పటికి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. 

 

వాస్తవంగా కీర్తి సురేష్ కి మహానటి సినిమా మాత్రమే తెలుగులో సూపర్ హిట్ ని ఇచ్చింది. ఆ తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి దారుణంగా ఫ్లాపయింది. అంతేకాదు అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు 2 లో చిన్న పాత్ర పోషించింది. ఇది చెప్పుకునేంత పెద్ద పాత్ర కాకపోయినా సెంటి మెంట్ పరంగా చూస్తే ఆ సినిమా కూడా ఫ్లాపే. అంతేకాదు తమిళంలో కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటించిన సినిమాలు ఫ్లాపయ్యాయి. దాంతో ఈ మధ్య మహేష్ బాబు సినిమాకి అనుకుంటే కీర్తి సురేష్ విషయంలో ఫ్యాన్స్ నుండి నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడదే టాక్ నితిన్ కీర్తి సురేష్ ల రంగ్ దే సినిమా విషయంలోను వినిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: