డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ సక్సస్ ని అందుకిని కం బ్యాక్ అయ్యాడు. చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలుగా పూరికి హిట్ అన్నది దక్కనే లేదు. ఎన్ని సినిమాలు చేసినా ఫ్లాపవుతూనే ఉన్నాయి. ఆఖరికి తన కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీసిన భారీగా నష్టాలను మిగిలిచింది. అయితే రాం తో తీసిన ఇస్మార్ట్ మాత్రం పూరి లోని స్టామినినాని మరోసారి నిరూపించింది. దాంతో విజయ్ దేవరకొండ తో మళ్ళీ కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. పాన్ ఇండియా సినిమాగా నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా తో పాటు కొడుకుతో నిర్మిస్తున్న రొమాంటిక్ సినిమా మీద ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. వాస్తవంగా పూరి అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ రెండు సినిమాలు సమ్మర్ లో విడుదల చేయాలనుకున్నారు. కాని ఇప్పుడు అది సాధ్యపడే అవకాశం కనిపించడం లేదు. 

 

లాక్ డౌన్ నేపథ్యంలో ఆ సమయాన్ని పూరి పూర్తిగా కథలు రాసుకునేందుకు ఉపయోగిస్తున్నారట. మిగతా దర్శక, రచయితల కంటే ఎంతో విభిన్నంగా కథలు ఆలోచించేందుకు పూరి కి కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ పూరీ కి బాగా కలిసివచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం ఒక స్టార్ హీరో కోసం కథను రాస్తున్నట్లుగా పూరి క్లారిటీ ఇచ్చారు. విజయ్ దేవరకొండతో సినిమా తర్వాత ఆ స్టార్ హీరోతోనే పూరి నెక్స్ట్ సినిమా ఉంటుందని కూడా ప్రేక్షకులను హింట్ ఇచ్చేశారు. అయితే ఆ స్టార్ హీరో ఎవరు అన్నది ఇప్పుడు అందరికి ఆసక్తికరమైన విషయం గా మారింది. 

 

అయితే చాలా మంది పూరి ప్రస్తుతం రాస్తున్న కథ నందరమూరి నట సింహం బాలకృష్ణ కోసం అని చెపుకుంటున్నారు. ఇంతకముందు బాలయ్య పూరి కాంబినేషన్ లో పైసా వసూల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పెద్ద ఫ్లాప్ గా మిగిలింది. అయినా ఇద్దరు ఒకరి తో ఒకరికి ఉన్న ట్యూనింగ్ వల్ల మరోసారి కలిసి సినిమా చేయాలని పైసా వసూల్ సమయం లోనే అనుకున్నారు. పూరి స్టైల్ కి బాలయ్య బాగా ఇంప్రెస్ అయ్యాడు. అలాగే బాలయ్య లో ఉన్న ఎనర్జీ కి పూరి పక్కా హిట్ ఇవ్వాలనే గట్టి పట్టుదలో ఉన్నాడు. ఈ నేపథ్యం లోనే త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అంటున్నారు. బాలయ్య కూడా పైసా వసూల్ ఎటూ దెబ్బేసింది కాబట్టి ఈసారి బ్లాక్ బస్టర్ కొడదామని పూరి తో అన్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: