టాలీవుడ్ నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ హిట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటించిన ఈ సినిమాకు యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి దాదాపుగా 13 ఏళ్లకు పైగా గ్యాప్ తరువాత టాలీవుడ్ కి ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని అందించగా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల పై సూపర్ స్టార్ మహేష్ తో పాటు అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. 

 

చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత సూపర్ స్టార్ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ ని పండించడంతో ఆడియన్స్ ని ఈ సినిమా మరింతగా ఆకర్షించింది. ఇకపోతే ఈ సినిమా ఇటీవల జెమినీ టీవీలో ఉగాది పండగ కానుకగా ప్రదర్శితం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజున ఈ సినిమా మొత్తంగా 23.4 టిఆర్పి రేటింగ్ సాధించినట్లు అధికారికంగా నిన్న న్యూస్ బయటకు రావడం జరిగింది. గతంలో మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమాకు అత్యధిక రేటింగ్ రావడం జరిగింది. అయితే చాలా గ్యాప్ తరువాత ప్రస్తుతం బుల్లితెరపై ఈ స్థాయి రేటింగ్ రావడం, అది కూడా బాహుబలి రెండు భాగాల రేటింగ్స్ ని అధిగమించి ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో సరిలేరు నిలవడం జరిగింది. 

 

కాగా ఈ టిఆర్పి రేటింగ్ లో ఒక అద్భుతం దాగుందని అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ అదేమిటంటే, 23.4 (2+3+4) ఈ మూడు సంఖ్యలను కలిపితే మహేష్ బాబు లక్కీ నెంబర్ 9 రావడం అద్భుతం అని అంటున్నారు. అటు థియేటర్స్ లోను, ఇటు బుల్లితెరపై అదరగొట్టిన ఇంత గొప్ప సినిమాని మా సూపర్ స్టార్ కు అందించడం ఎంతో ఆనందంగా ఉందని దర్శకుడు అనిల్ రావిపూడికి వారు పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెల్పుతూ కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: