సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో 2020 లో ఆరంభం అదిరిపోయింది. చాలా కాలం తర్వాత మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఇదే ఊపుతో వంశీ పైడిపల్లితో సెట్స్ మీదకి వెళ్ళాలనుకున్నాడు. కాని వంశీ ఇచ్చిన షాక్ కి మహేష్ ఏకంగా ప్రాజెక్ట్ నె క్యాన్సిల్ చేసుకున్నాడు. సరిలేరు సెట్స్ మీద ఉన్నప్పటి నుంచే మహేష్ బాబు వంశీ పైడి పల్లి కాంబోలో సినిమా తెరకెక్కబోతుందని బాగా ప్రచారం జరిగింది. కాని కథ బాబు కి ఏమాత్రం నచ్చకపోవడం తో నిర్మొహమాటంగా నో చెప్పేశారు. 

 

దాంతో ఇప్పుడు మహేష్ బాబు తన నెక్ట్స్ సినిమాని గీతా గోవిందం డైరెక్టర్ పరశురాంతో చేయడానికి కమిటయ్యాడు. ప్రస్తుతం కరోనా విధ్వంశం కారణంగా ఆగింది. లేదంటే ఈ పాటికే సినిమా మొదలయ్యోది. ఇదిలా ఉంటే గత 10,15 రోజులుగా ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ ఎవరనే విషయంలో చిత్ర యూనిట్‌ క్లారిటి ఇవ్వడం లేదు. ఈ సినిమాలో మహేష్ సరసన ముందు కీర్తి సురేష్ నటిస్తుందని అన్నారు. నెగిటివ్ సెంటిమెంట్ కారణంగా కియారా అద్వాని పేరు ప్రచారం అవుతోంది. ఇప్పుడు ఈ ఇద్దరు కాదని బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ సూపర్ స్టార్ సరసన హీరోయిన్ గా ఎంపిక అయిందని టాక్ మొదలైంది. 

 

ఎటు పాన్ ఇండియా రేంజ్ లో సినిమా నిర్మిస్తున్నారు కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ అయితే సినిమాకి ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. కియారా ప్రస్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్ లో బిజీగా ఉండటం తో డేట్స్ సర్ధుబాటు చేయలేకపోతుందట. అందుకే ఇప్పుడు సారా అలీఖాన్ ని తీసుకోవాలని సన్నాహాల్లో ఉన్నారట. మరి ఫైనల్ ఎవరవుతారో చూడాలి. మొత్తానికి అసలు సినిమాకి కొబ్బరికాయ కొట్టనేలేదు హీరోయిన్ మాత్రం ఈమే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడం హాట్ టాపిక్ గా మారింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: