ఈ సంవత్సరం సంక్రాంతి వార్ లో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ పై స్పష్టమైన ఆదిపత్యాన్ని ప్రదర్శించింది. బన్నీ ‘అల’ కు 150 కోట్ల నెట్ కలక్షన్స్ రావడంతో ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ గా మారడమే కాకుండా ‘బాహుబలి 2’ రికార్డులను కూడ కొన్ని ఏరియాలలో ‘అల’ బ్రేక్ చేయడంతో అల్లు అర్జున్ రేంజ్ అందరికీ తెలిసివచ్చింది. 


అయితే కరోనా ప్రభావంతో జనం అంతా లాక్ డౌన్ పరిస్థితులలో ఇంటి వద్దనే ఉంటున్న రోజులలో మహేష్ తన ఇంటి నుండి బయటకు రాకుండానే అల్లు అర్జున్ పై స్వీట్ రివెంజ్ తీర్చుకోవడం మహేష్ అభిమానులకు పండుగగా మారింది. ఈమధ్య కాలంలో అమెజాన్ ప్రైమ్ లాంటి ఒటిటి ప్లాట్ ఫామ్ ముందుగా టాప్ హీరోల సినిమాలు వచ్చేస్తున్నాయి. 


ఆతరువాత ఆసినిమాలు ఛానల్స్ లో ప్రసారం అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. ‘సాహో’ ‘సైరా’ లాంటి భారీ సినిమాలకు కూడ బుల్లితెర పై చాల తక్కువ రేటింగ్స్ వచ్చాయి. అయితే ఈ ట్రెండ్ ను కూడ బ్రేక్ చేస్తూ ‘సరిలేరు నీకెవ్వరు’ బుల్లితెర పై ఒక సరికొత్త క్రియేట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 


గతవారం మార్చి 25న ఉగాది పండుగ సందర్భంగా జెమిని ఛానల్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ పండుగ రోజు సాయంత్రం ప్రసారం అయింది. జనం పండుగనాడు కూడ కనీసం బయటకు రాలేని స్థితిలో ఉండటంతో బుల్లితెర పై వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ ను విరగబడి చూసారు. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో టెలివిజన్ వ్యూవర్‌ షిప్ రేటింగ్ 23.4 టీవీఆర్‌ ను ‘సరిలేరు నీకెవ్వరు’ సొంతం చేసుకుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో ఇదే అత్యధిక టీవీఆర్. గతంలో ‘బాహుబలి 2’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ కు 22.7 టీవీఆర్ రాగా ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ దాన్ని దాటేయడం విశేషం. అంతేకాదు గడిచిన 15 ఏళ్లలో ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో టీవీఆర్ రాలేదు. దీనితో మహేష్ అల్లు అర్జున్ కు బుల్లితెర లో సరైన సమాధానం ఇచ్చాడు అంటూ మహేష్ అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: