కరోనా ప్రభావం భారత్ పై రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకుంది.. జనతా కర్ఫ్యూ పేరుతో ప్రభుత్వాలు ప్రజలను హౌజ్ అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.. అయితే తెలుగు రాష్ట్రాలకు ఎందరో మహనీయుల విరాళాలను అందిస్తున్నారు.. ఇప్పటికే. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయాన్ని అందించారు... 

 

 

 

ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు విరాళాలు అందించారు.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది.

 


 

 

సినీ ఇండస్ట్రీ షూటింగులు అన్నీ ఆపుకొని థియేటర్స్ మల్టీప్లెక్స్ మూతవేసి లాక్ డౌన్ చేసుకుంది. దీంతో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాను. షూటింగులు ఆగిపోవడంతో ఈ ఏడాది విడుదలయ్యే సినిమాలు కూడా తగ్గే అవకాశం ఉంది. మన టాలీవుడ్ లో ఈ ఏడాది అల్లు అర్జున్ బాలయ్య నిఖిల్ నాగచైతన్య లాంటి హీరోలు రెండు రెండు సినిమాలను రెడీ చేయాలని అనుకున్నారు..కానీ దెబ్బకు ఏడాదిలో ఒక్క సినిమా విడుదల కావడం కూడా కష్టమవుతుందని అర్థమవుతుంది.. 

 

 

 

ప్రస్తుతం వీరు నటిస్తున్న సినిమాలు షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసినా రిలీజ్ డేట్ల విషయం లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. బాలకృష్ణ - బోయపాటి సినిమా బన్నీ - సుకుమార్ సినిమా నిఖిల్ కార్తికేయ2 - 18 పేజిస్ లాంటి సినిమాలు ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇవి  షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చే టైమ్ కి ఆర్.ఆర్.ఆర్  లాంటి పాన్ ఇండియా మూవీస్ కూడా సిద్ధంగా ఉంటాయి. అప్పుడు వీటన్నిటికీ డేట్స్ క్లాషెస్ కచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలు తేదీలను ముందుకు జరుపుకుంటూ పోతే దసరా సీజన్లో రిలీజ్ కావాల్సిన ప్రభాస్ - రాధాకృష్ణ మూవీ కేజీయఫ్ 2 లాంటి పాన్ ఇండియా చిత్రాల రిలీజ్ డేట్స్ గురించి కూడా ఆలోచించాలి. ..ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిర్మాతలకు పెద్ద సమస్యగా మారిందనే చెప్పాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: