సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు వచ్చి పడ్డాయి. మహర్షి తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన మహేష్ ప్రస్తుతం గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహర్షి తర్వాత స్టార్ డైరక్టర్ తో సినిమా చేస్తాడని అనుకుంటే నాలుగు చిత్రాలు మాత్రమే తీసిన అనిల్ రావిపూడికి అవకాశం ఇచ్చి అతడిని స్టార్ డైరెక్టర్ ని చేశాడు.

 

సరిలేరు తర్వాత వంశీతో చేస్తానని చెప్పిన మహేష్ కథ నచ్చకపోవడంతో పరశురామ్ తో వెళ్లాడు. అయితే గత కొన్ని రోజులుగా చూసుకుంటే తెలుగులో టాప్ డైరెక్టర్లుగా వెలుగుతున్న దర్శకులందరితో మహేష్ కి విభేధాలు వచ్చినట్లు తెలుస్తుంది. మొదట పూరి జగన్నాథ్ తో సినిమా చేయనని చెప్పడంతో పూరి హర్ట్  అయిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత సుకుమార్ తో సినిమా చేస్తానని చెప్పి అక్కడ కూడా సేమ్ రిపీట్ కావడంతో సుకుమార్ తోనూ కనెక్షన్ కట్ అయింది.

 

ఇక మొన్న వంశీ పైడిపల్లి విషయంలోనూ అలాగే జరిగింది. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్లతో పొరపొచ్చాలు రావడం ఆయన అభిమానులకి నచ్చడం లేదట. అందుకే మహేష్ తన తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలని చూస్తున్నాడట. త్రివిక్రమ్ తో ఇప్పటి వరకు రెండు సినిమాలు చేసిన మహేష్ కి ఖలేజా దెబ్బేసినప్పటికీ అతడు సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. 

 


త్రివిక్రమ్, ఎన్టీఆర్ లా కాంబినేషన్ లో వచ్చే సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలని అనుకుంటున్నాడట. ఈ విషయం తన సన్నిహితులకి చెప్పాడట. మహేష్ చేయాల్సిన డైరెక్టర్ల లిస్ట్ ఈ పాటికే చాలా పెరిగిపోవడంతో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా ఇప్పుడప్పుడే ఉండదని.. దానికి చాలా టైమ్ పడుతుందని అంటున్నారు. అప్పటి వరకు మహేష్ వంశీకైనా ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: