దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. కరోనా కారణంగా షూటింగ్ దశలో ఉన్న సినిమాలు అన్ని వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో సినీ తారాలందరు ఇళ్లకే పరిమితమయ్యారు..కానీ సోషల్ మీడియా ద్వారా ప్రతి నిమిషం వారు లాక్ డౌన్ లో ఇంట్లో ఉంటూ ఏం చేస్తారన్న విషయాలని అభిమానులతో పంచుకుంటున్నారు. జనతా కర్ఫ్యూ పేరుతో ప్రభుత్వాలు ప్రజలను హౌజ్ అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.. అయితే తెలుగు రాష్ట్రాలకు ఎందరో మహనీయుల విరాళాలను అందిస్తున్నారు.. ఇప్పటికే. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయాన్ని అందించారు... మరి కొందరేమో పేదలకు స్వయంగా భోజనం, అలాగే కరొనను ఎదుర్కొనే పరికరాలను అందజేస్తున్నారు.
అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది.అందుకే రవాణా వ్యవస్థ తో పాటుగా అన్ని కలెక్షన్లకు గండి పడిందని సినీ నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు.
తెలుగు చిత్ర సీమలోని సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.. ఈ మేరకు దొరికిన ఈ కొద్దీ సమయాన్ని వృధా చేయకుండా వారికి తెలిసిన గతంలో వారు నేర్చుకున్న పనులపై శ్రద్ద చూపిస్తూ వస్తున్నారు. అయితే వారు ఇన్ కూర్చొని ఏదైతే చేశారో వాటిని సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తూ వస్తున్నారు. వారిని ఇంట్లో కూర్చుని మీకు నచ్చిన దానికి చేయాలనీ పిలుపునిస్తున్నారు.
శ్రీరామనవమి సందర్బంగా సినీ తారలు ఇంట్లోనే పండుగను జరుపుకొంటూ అభిమానులకు శుభాకంక్షాలు తెలిపారు. అయితే మామూలుగానే సినిమాలకోసం ఎదురు చూస్తున్న సినీ హీరోల పరిస్థితి మరి దారుణంగా మారిందని చెప్పాలి .. ఇక ఇళ్లకే పరిమితమైన చాలా మంది హీరోలు సిని నిర్మాతల దృష్టిలో పడాలని రకరకాల పనులు చేస్తూ వస్తున్నారు. తాజాగా హీరో కార్తికేయ ఇంట్లో ఉన్న వాటితో జిమ్ చేస్తూ ఒక వీడియోను సోషల్ ఎడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది... చూడండి మీరు ఓ పారి..