లాక్డౌన్ తో తెలుగు సినీ పరిశ్రమ పూర్తిగా మూతబడింది. థియేటర్లన్నీ బంద్ అవ్వగా, సినిమా షూటింగులన్నింటినీ నిలిపివేశారు. దీంతో సినిమాలపైనే ఆధారపడిన కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ఎత్తివేయనుండగా, షూటింగ్లు సెట్లపైకి వెళ్లేందుకు మరికొంత సమయం పట్టనుంది.
ఈనేపథ్యంలో కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పలువురు హీరోలు తమ వంతు సాయంగా వి రాళాలు అందజేసేందుకు ముందుకు వస్తున్నారు. ప్రముఖు నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన కరోనా చారిటీ ట్రస్ట్ కు హీరోలు, దర్శకులు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్చరణ్తోపాటు ప్రభాస్, మహేశ్ బాబు విరాళాలు అందించారు. తాజాగా నందమూరి బాలకృష్ణ సినీ కార్మికుల కోసం రూ.25 లక్షల విరాళాలన్ని అందజేశారు. అదేవిధంగా డైరెక్టర్ సంపత్ నంది రూ. 50 లక్షలను అందజేశారు.