టాలీవడ్, కోలీవుడ్ లో 80వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోల రేంజ్ లో పేరు తెచ్చుకుంది నటి ఖుష్బూ. బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించినా తర్వాత తెలుగు, తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించిన కోలీవుడ్ లో స్థిరపడ్డారు ఖుష్బూ. టాలీవుడ్ లో వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది. అప్పట్లో తమిళనాట ఖుష్బూ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉండేది.. ఎంతగా అంటే ఏకంగా ఆమెకు ఓ గుడి కట్టి పూజించారు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇప్పటి వరకు 200లకు పైగా సినిమాల్లో నటించింది.
తమిళంలో స్టార్ హీరోయిన్ కు మొదటిసారి గుడి కట్టింది తమిళనాడులోనే కావడం విశేషం. నిమా రంగంలో తిరుగులేని హీరోయిన్ గా ఎదిగిన ఈ స్టార్, తరువాత సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చింది. రాజకీయాల్లో తనదైన పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ తరుపు నుంచి ఆమె ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత కొంత కాలంగా ఖుష్బూ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయాల్లో ఉంటూనే అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది.
టాలీవుడ్ లో చివరిగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో కన్పించింది. కాకపోతే ఈ మూవీ పెద్దగా హిట్ మాత్రం కాలేదు. ఆ తర్వాత డైరెక్ట్ గా తెలుగు సినిమాల్లో కనిపించలేదు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కొన్ని ప్రాగ్రామ్స్ కండెక్ట్ చేస్తుంది... సీరియల్స్ లో కూడా నటిస్తుంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.