మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ ఇద్దరు కలిసి సినిమా తీస్తే ఎలా ఉంటుంది. అదేంటి ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి సినిమాలు  చేశారు కదా అననుకోవచ్చు. అతడు, ఖలేజా ఈ రెండు వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు. హ్యాట్రిక్ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు.

 

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం మహేష్ త్రివిక్రమ్ కలిసి ఒక సినిమా  చేసేందుకు సిద్ధమవుతున్నారట. మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత పరశురామ్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని టాక్. అల వైకుంఠ పురములో సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్న త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో ఫిక్స్  చేసుకున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని తెలుస్తుంది. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందట.

 

ఎన్టీఆర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ కచ్చితంగా మహేష్ సినిమా చేస్తాడని వారి క్లోజ్ సర్కిల్స్ లో వినిపిస్తిన్న మాట. అయితే ఈసారి మహేష్ తో త్రివిక్రమ్ ఎలాంటి మూవీ చేస్తాడో అని ఇప్పటినుండి అంచనాలు పెట్టుకుంటున్నారు. మహేష్ పరశురామ్ మూవీ కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా అని తెలుస్తుంది.ఈ మూవీ లో కీర్తి సురేష్, కియరా అద్వానీ ఇద్దరిలో ఒకరు హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

 

కథల విషయం లో ఇదివరకులా కాకుండా స్టార్ హీరోలు కంటెంట్ ఉన్న సినిమాలకే ఓటు వేస్తున్నారు. ఎంత తోపు డైరెక్టర్ అయినా సరైన కథ లేనప్పుడు ఎంత కష్టపడినా వేస్ట్ అవుతుంది. మహేష్ ఈ విషయాలో జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి వరుస సక్సెస్ లు కొడుతున్నాడు. త్రివిక్రమ్ మహేష్ మళ్ళీ కలిసి సినిమా చేస్తే సినీ లవర్స్ కి పెద్ద పండుగే అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: