కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా లాక్ డౌన్ చేసుకుని ఇళ్లలోనే ఉండి కరోనాపై యుద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకూ లాక్ డౌన్ ని పాటిస్తున్నారు. సినిమా షూటుంగులన్నీ క్యాన్సిల్ అయిపోవడంతో సినిమావాళ్ళు ఇళ్ళలోనే ఉండిపోతున్నారు. గతంలో ఎన్నడూ దొరకనంత ఖాళీ టైమ్ దొరకడంతో అందరూ తమకు నచ్చిన పనులని ఇళ్ళలోనే చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు

 

 

రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ లాక్ డౌన్ కారణంగా ముంబయిలో తన ఇంటికే పరిమితమైంది. ఢిల్లీ నుండీ ఇటీవలే ముంబైకి షిఫ్ట్ అయిన పాయల్ లాక్ డౌన్ ని చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తుంది. సామాజిక దూరం పాటించాలన్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో తన అభిప్రాయాలని పంచుకుంటుంది. లాక్ డౌన్ నేపథ్యంలో అభిమానుల ప్రశ్నలకి సమాధానాలిచ్చిన పాయల్ ఒకానొక అభిమాని చేసిన పనికి విపరీతంగా కోప్పడింది.

 


లాక్ డౌన్ ని కాదని బయట్ తిరుగుతున్నానని, అయినా తనకేం కాదని చెప్పిన ఒక అభిమానిపై ఫైర్ అయిన పాయల్ కరోనా వల్ల భయంకర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో బయట తిగుతున్నావా.. అది ఎంత ప్రమాదమో తెలుసా.. నీకొక్కడికే కాదు నీతో ఉండేవాళ్లకి కూడా ప్రమాదమే. ప్రభుత్వాలు కరోనాని తరిమి కొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే, నీ లాంటి వాళ్ళు ఆ ప్రయత్నానికి భంగం కలుగజేస్తున్నారని కోప్పడింది.

 

 

కరోనా కారణంగా దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశమంతా కరోనా భూతాన్ని తరిమికొట్టడానికి లాక్ డౌన్ పాటిస్తుంటే నువ్వు బయట తిరుగుతూ సమాజానికి చేటు చేస్తున్నావ్ అంటూ విపరీతంగా కోప్పడింది. అయితే ఈ లాక్ డౌన్ వేళ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ డైలీ రొటీన్ బాగా మారిందట. పనేమీ లేకపోవడంతో ఇంట్లోనే ఉండి సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తున్నానని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: