బుల్లితెరపై సుడిగాలి సుధీర్, విష్ణు ప్రియ ఈ జంటను చుస్తే అభిమానులకు కన్నుల పండగ. వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంత బాగా కుదిరింది. ఈ జంటకు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోవే పోరా షోతో ప్రజలను మదిని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇప్పుడు జనాలు వీరిద్దరి కాంబినేషన్‌లో వేరే ఏ షో వచ్చిన బాగుండు అనుకుంటున్నారు.

 

కరోనా ప్రభావం వలన ప్రపంచ వ్యాప్తంగా సామజిక దూరంపై పెద్ద ఎత్తున అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి ప్రయత్నాలను అటు సినిమా హీరోలు కూడా తమ భుజాన వేసుకున్నారు. ఇటు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ మొదలు అందరు హీరోలు సామజిక దూరంపై అవగాహన పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రజల్లో అవగాహన కల్పించడానికి పాటలు కూడా సిద్ధం చేశారు. 

 

అయితే జబర్దస్త్ నటులు మాత్రం కరోనా నివారణ ప్రయత్నాల్లో చేతులు కలపకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే సుడిగాలి సుధీర్ , యాంకర్ విష్ణుప్రియ ఇద్దరూ జంటగా చేస్తున్న షో పోవే పోరా. అయితే ఆ షోకి సంబంధించిన పోవే పోరా ప్రోమోను విడుదలైంది. అందులో ఎప్పటి లాగే ఇద్దరూ కలిసి నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా పాటకు ఇద్దరూ హవా భావాలు ఇస్తారు. అయితే దేశంలో మామూలు పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా చేసి ఉంటే అభిమానులు ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిల్లో ఆలా చేయడం నెటిజనులకు ఏమాత్రం నచ్చలేదు.

 

ఒక్కవైపు  ప్రపంచం మంతాసామజిక దూరం వైపు అడుగులు వేస్తున్నారు. అయితే సుడిగాలి సుధీర్ మాత్రం బాధ్యత మరిచి ఇలా చేయడం ఎంత వరకూ మంచిగా లేదని అభిమానాలు అంటున్నారు. అంతే కాదు సుడిగాలి సుధీర్ లాంటి వారు ముందుకు వచ్చి సామజిక దూరం గురించి తెలియజేస్తే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: