ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ ఫుల్ డైలాగ్ లకు అదిరిపోయే యాక్షన్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే హీరో ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు నందమూరి బాలకృష్ణ. నందమూరి నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా పరిచయమై దశాబ్దాలు గడిచిపోతున్నా... బాలకృష్ణకు రోజురోజుకూ క్రేజ్ పెరిగిపోతుంది. ఇక నందమూరి బాలకృష్ణ తో ఎంతో మంది డైరెక్టర్లు ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ప్రేక్షకులకు నచ్చిన మెచ్చిన కాంబినేషన్ లు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా ప్రేక్షకులు బాగా నచ్చిన కాంబినేషన్ లో ఒకటి బోయపాటి బాలకృష్ణ. అంతే కాకుండా దర్శకుడు పూరీ జగన్నాథ్... బాలకృష్ణ కాంబినేషన్ కూడా నందమూరి అభిమానులకు ఫెవరేట్గానే ఉంటుంది. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. 

 

 

 పైసా వసూల్ అనే పేరుతో సరికొత్త మేనరిజంతో బాలకృష్ణ ను చూపించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ సినిమాలో బాలకృష్ణ మానరిజం  బాగా నచ్చేసింది ప్రేక్షకులకు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ ప్రస్తుతం ప్రేక్షకులకు ఫేవరేట్ గా మారిపోయింది. అయితే  వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్లు  తెలుస్తోంది. ప్రస్తుతం పూరిజగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్  ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కరణ్ జోహార్ తో కలిసి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు పూరి జగన్నాథ్. 

 

 

 ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో పూరి జగన్నాథ్ సినిమా చేయొచ్చు అనే వార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమా సెట్స్ పైకి  వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా బాలకృష్ణ పేరు తెరమీదికి వచ్చింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పైసా వసూల్ సినిమా అంతగా వసూళ్లు రాబట్టకపోయినా ఈ సినిమాలో బాలకృష్ణ ను సరికొత్తగా చూపించాడు పూరి జగన్నాథ్. ఈ క్రమంలోనే మరోసారి బాలకృష్ణ తో సినిమా చేయాలనే ఉద్దేశంతో దర్శకుడు పూరి జగన్నాథ్ ఉన్నాడట. ఇక పైసా వసూల్ సినిమా సమయంలోనే బాలకృష్ణతో మంచి సాన్నిహిత్యం పెరిగిపోవడంతో బాలకృష్ణ ఒప్పుకుంటాడు అనే నమ్మకంతో బాలకృష్ణ కోసం ఒక కథను కూడా సిద్దం చేస్తున్నాడట పూరి జగన్నాథ్. అయితే త్వరలో ఈ కథను బాలకృష్ణకు వినిపించనున్న పూరి జగన్నాథ్ అన్ని కుదిరితే ఈ సినిమా సెట్స్పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ లో .

మరింత సమాచారం తెలుసుకోండి: