2018 డిసెంబర్ లో విడుదలైన కేజిఎఫ్ సినిమా దేశ చలనచిత్ర రంగంలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కన్నడ స్టార్ హీరో యశ్ రాఖీ బాయ్ పాత్రను చాలా అద్భుతంగా పోషించాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అన్ని భాషలలో బ్లాక్ బస్టర్ గా నిలిచి కన్నడ చిత్ర పరిశ్రమ స్టామినా ను భారతదేశానికి తెలియజేసింది. 

 

దీంతో చిత్రానికి సంబంధించిన సీక్వెల్ కేజిఎఫ్ చాప్టర్-2 పై చాలా పెద్ద స్థాయిలో అంచనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరో కేజిఎఫ్ తరువాతి భాగంలో ఎలా గోల్డ్ మైన్స్ ని ఏలబోతున్నాడో చూడాలని అంతా ఆతృతగా ఉన్నారు. చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం అక్టోబర్ 23 విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించడంతో అభిమానులంతా ఖుషీ అయిపోయారు.

 

ఇక చిత్రం యొక్క రెండో భాగం విషయానికి వస్తే సంజయ్ దత్ డేంజరస్ విలన్ పాత్రలో మెరవనుండగా బాలీవుడ్ బ్యూటీ రవీనాటాండన్ దేశ ప్రధాని పాత్రలో కనిపించనుందట. రవీనా పాత్రకు చాలా నెగిటివ్ షేడ్స్ ఉండగా విలన్స్ అందరిని చంపేసిన రాఖీ బాయ్ కేజిఎఫ్ కింగ్ అయిన తర్వాత రవీనా టాండన్ రాజకీయ కుట్రలతో అతనిని ముప్పుతిప్పలు పెట్టే సన్నివేశాలు మరియు చివరికి అతనిని హతమార్చడం కూడా చిత్రానికి హైలెట్ అవుతుందని సమాచారం.

 

తల్లి మాట కోసం రాఖీభాయ్ గొప్ప రాజుగా ఎదిగి సాధించి చూపిస్తాడని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇదిలా ఉండగా కేజీఎఫ్ లో రాఖీభాయ్ జీవితం మలుపు తిరుగుతుందో అని అభిమానులలో ఆసక్తి నెలకొంది. మరి కేజీఎఫ్2 లో హీరోయిజం మాములుగా ఉండదని మాత్రం ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. చూడాలి మరి త్వరలో ఎలాంటి సందేశం అందుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: