కరోనా వైరస్ దెబ్బకి సినిమా రంగం కుదేలైంది. దాదాపు అన్ని సినిమా షూటింగ్లో ఆగిపోవడంతో సినిమా హీరోలు అంతా ఇళ్లకే పరిమితం కావడంతో నిర్మాతలకు ఏం చేయలేని స్థితి ఏర్పడింది. కారణం చూస్తే కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్. ఇటువంటి పరిస్థితుల్లో సినిమారంగానికి పోటీగా ఇటీవల ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ రెడీ అవుతున్న విషయం అందరికీ తెలిసినదే. భారీ బడ్జెట్ మరియు స్టార్ నటీనటులతో అదిరిపోయే కంటెంట్ తో వెబ్ సిరీస్ లు బాగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్ హీరోలకు ఈ వెబ్ సిరీస్ కంటెంట్ లు బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా వీటిలో భారీ పారితోషికాలు తో పాటు లాభాలలో వాటా కూడా కొంత మంది నిర్మాతలు హీరోలు ఇవ్వటంతో చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలు వెబ్ సిరీస్ చేయడానికి బాగా ఇష్టపడుతున్నారు.

 

ఈ నేపథ్యంలో తాజాగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి క్రేజ్ క్రియేట్ చేసుకున్న కుర్రహీరో విశ్వ‌క్ సేన్ కూడా త్వ‌ర‌లోనే వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇవ్వటానికి మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల స్వయంగా విశ్వ‌క్ సేన్ కన్ఫామ్ చేశారు. త్వరలోనే మంచి కంటెంట్ కలిగిన వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు...కథ నచ్చడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఇండస్ట్రీలో వినబడుతున్న వార్తలు బట్టి చూస్తే పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వ‌క్ సేన్ వెబ్ సిరీస్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

 

దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో విశ్వక్ మంచి నిర్ణయం తీసుకున్నాడు అని చాలా మంది నెటిజన్లు అంటున్నారు. రాబోయే రోజుల్లో కరోనా వైరస్ ఎఫెక్ట్ కి సినిమా హాల్ లోకి వచ్చి జనాలు చూసే ఛాన్స్ ఉండదని...అదేవిధంగా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు కూడా జరిగే చాన్స్ ఉండవని సరైన నిర్ణయం విశ్వక్ తీసుకున్నాడని అంటున్నారు. మరి ఇదే బాటలో ఎంత మంది పయనిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: