టాలీవుడ్ లో అగ్ర దర్శకుడు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు పూరీ జగన్నాథ్. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమా కెరీర్ ప్రారంభించిన పూరీ, తర్వాత రోజుల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, శివమణి, సూపర్, పోకిరి, చిరుత, బిజినెస్ మ్యాన్, నేనింతే చిత్రాలతో డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లోని టాప్ హీరోలందర్ని డైరెక్ట్ చేసిన పూరీ ఇటు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా తన టాలెంట్ ను చూపించాడు. కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలల్లో పూరీకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ తో సినిమా తీసి హిందీ ప్రేక్షకుల మెప్పు కూడా పొందాడు. టాలీవుడ్ లో వేగంగా సినిమాలు తీసే దర్శకుడు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు పూరి జగన్నాధ్. ఈయనతో పాటు ఇండస్ట్రీలో ఉన్న ఏ దర్శకులు పూరి చేసిన సినిమాలలో సగం కూడా చేయలేదు. పది రోజుల్లో బ్యాంకాంక్ బీచ్ లలో కుర్చొని స్క్రిప్ట్ పూర్తి చేసే పూరి, మరో మూడు నెలల్లో సినిమాను చుట్టేస్తాడు.

 

ప్రెజెంట్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'ఫైటర్'. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. కాగా విజయ్ దేవరకొండ తో ఆయన చేస్తున్న మూవీ షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. దీనితో ఇంట్లో ఖాళీగా ఉంటున్న పూరి కొత్త మూవీ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. పూరి మెగా హీరో చిరు కోసం ఈ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తదుపరి కాదు ఆయన చరణ్ కోసం స్క్రిప్ట్ రాస్తున్నారంటూ మరో పుకారు నడిచింది. అయితే పూరి అసలు టాలీవుడ్ లో ఎవరినీ టార్గెట్ చేసుకొని రాయడం లేదట. ఆయన ఫోకస్ బాలీవుడ్ యంగ్ హీరోలపై పడిందని సమాచారం. పూరి బాలీవుడ్ హీరోలను మైండ్ లో పెట్టుకొని అక్కడి నేటివిటీకి సరిపోయేలా ఓ మోడరన్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. విజయ్ దేవరకొండ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా కరణ్ జోహార్ ఉన్న నేపథ్యంలో స్క్రిప్ట్ నచ్చితే ఆయన్ని నిర్మాతగా ఈజీగా ఒప్పించవచ్చు. కాబట్టి పూరి బాలీవుడ్ ని దృష్టిలో పెట్టుకొని కొత్త స్క్రిప్ట్ రాస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: