కీర్తి సురేష్ కి తెలుగులో నేను శైలజ, నేను లోకల్, మహానటి ..వరుసగా మూడు సినిమాలు సూపర్ హిట్ ని అందుకున్నాయి. ఆ తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి మాత్రం దారుణంగా ఫ్లాపయింది. అంతేకాదు అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు 2 లో నిముషాల పాత్ర పోషించింది. ఇక తాజాగా యంగ్ హీరో నితిన్ తో రంగ్ దే సినిమాలో నటిస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇది ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అంతేకాదు కాస్త నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పటికి హిట్ గ్యారెంటీ అన్న టాక్ వినిపిస్తుంది.

 

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ చిత్రానికి గీతగోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు 27 ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం కాస్త డిలే అవుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం జూన్ లేదా జూలై నుండి ఈ సినిమాని ప్రారంభించాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారట. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ మరో న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

 

త్వరలో కీర్తి సురేష్ పెళ్ళి పీటలెక్కబోతోందని లేటెస్ట్ న్యూస్ కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో బాగా వైరల్ అవుతోంది. కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ స్నేహితుడి కొడుకుతో కీర్తి పెళ్ళి ఫిక్సైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ కమిటయిన సినిమాలు పూర్తి కాగానే పెళ్ళి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారట.

 

ఇక కీర్తి సురేష్ కి కాబోయో భర్త బిజినెస్ మాన్ అని సమాచారం. అంతే దీనితో పాటు మరో న్యూస్ కూడా వైరల్ అవుతోంది. అదే సౌందర్య బయోపిక్ లో నటించబోతుందని. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. మరీ ఈ రెండు విషయాలలో ఎంతవరకు నిజముందో కీర్తి సురేష్ వెల్లడిస్తే తెలుస్తుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: