డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ సక్సస్ ని అందుకని కం బ్యాక్ అయ్యాడు. నాలుగేళ్ళలో అంచనాలు పెట్టుకున్న సినిమాలన్ని ఫ్లాపులుగానే మిగిలాయి. దాంతో తన కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీసి హిట్ కొట్టాలని కసితో మెహబూబా తీశాడు. ఆ సినిమా రిజల్ట్ అందరికీ తెలిసిందే. అయితే రాంతో తీసిన ఇస్మార్ట్ మాత్రం పూరి మార్క్ హిట్ ని కొట్టింది. ఇదే ఊపుతో విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా సినిమాని నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నాడు.  వాస్తవంగా పూరి అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా సమ్మర్ లో ఒకే సారీ నాలుగు భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా కాటెసింది. లాక్ డౌన్ తో ఇంట్లో కూర్చున్నాడు పూరి.

 

ఈ లాక్ డౌన్ నేపథ్యంలో పూరి పూర్తిగా కథలు రాసుకుంటున్నారు. కథ రాయడం లో పూరి యమా స్పీడ్ అన్న సంగతి తెలిసిందే . ఇప్పటికే ఆయన దగ్గర 10 కథలకి పైగానే ఉన్నాయి. అయినా ఒక స్టార్ హీరో కోసం కథ రాస్తున్నారట. విజయ్ దేవరకొండతో సినిమా తర్వాత ఆ స్టార్ హీరోతోనే పూరి నెక్స్ట్ సినిమా ఉంటుందని కూడా తాజాగా న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. అయితే ఆ స్టార్ హీరో ఎవరు అన్నది ఇప్పుడు అందరిలో క్యూరియాసిటిగా మారింది.

 

అయితే చాలా మంది పూరి ప్రస్తుతం రాస్తున్న కథ నందరమూరి నట సింహం బాలకృష్ణ కోసం అని చెపుకుంటున్నారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ కథ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసమని తెలుస్తుంది. ఇంతకముందు పవన్ పూరి కాంబినేషన్ లో బద్రి, కెమరా మాన్ గంగ తో రాంబాబు వచ్చి సూపర్ హిట్స్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నప్పటికి కుదరలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వెళ్ళారు. రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలని లైన్ లో పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కోసం పూరి కథ రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలు కంప్లీటయ్యాక పూరి సినిమా ఉండబోతుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: