దాదాపుగా రెండేళ్లకు పైగా గ్యాప్ తరువాత బాలీవుడ్ మూవీ పింక్ అధికారిక తెలుగు రీమేక్ అయిన వకీల్ సాబ్ ద్వారా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం లాకౌట్ వలన సినిమా షూటింగ్స్ పూర్తిగా బంద్ కావడంతో తన ఫ్యామిలీ తో కలిసి గడుపుతున్నారు. ఇక ఈ సినిమా తరువాత ఇప్పటికే పవన్ నటించబోయే తదుపరి సినిమా షూటింగ్ కూడా ఇటీవల ప్రారంభం అయింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏ ఎమ్ రత్నం తన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక గజ దొంగగా నటిస్తున్న ఈ సినిమా ని పీరియాడికల్ డ్రామాగా అత్యంత భారీ ఖర్చుతో, పాన్ ఇండియా ఫీల్ తో నిర్మిస్తున్నట్లు టాక్. 

 

ఇకపోతే ఈ సినిమా తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎంతో భారీగా తెరకెక్కనున్న ఈ సినిమా అధికారిక ప్రకటన ఇటీవల రావడం జరిగింది. అయితే కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ ని ఎంతో పకడ్బందీగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు హరీష్ రూపొందిస్తున్నాడట. 

 

ఇక ప్రస్తుతం లాకౌట్ నేపథ్యంలో హరీష్ ఆ స్క్రిప్ట్ కి మరింతగా మెరుగులు దిద్దుతున్నాడని, కొందరు ఆయన సన్నిహితుల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమా గబ్బర్ సింగ్ ని మించి దాని అబ్బలా ఉంటుందని, పక్కా కమర్షియల్ జానర్ లో రాబోతున్న ఈ సినిమా తప్పకుండా పవన్, హరీష్ కాంబోలో ఎన్నో ఏళ్ళ గ్యాప్ తరువాత మరొక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే పవన్ ఫ్యాన్స్ కు కు పండగే అని చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: