ఇటీవల టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు భాగాల సూపర్ డూపర్ హిట్స్ తరువాత మన దేశవ్యాప్తంగానే కాక, పలు ఇతర దేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్, మార్కెట్ సంపాదించుకున్న నటుడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఆ తరువాత యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఆయన నటించిన సాహో సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆశించిన రేంజ్ లో సక్సెస్ ని సాదించలేకపోయింది. ఇక ప్రస్తుతం జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ప్రభాస్, తప్పకుండా ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే దృఢ సంకల్పంతో పని చేస్తున్నారట. 

 

కొన్నేళ్ల క్రితం యూరప్ దేశంలో జరిగిన ఒక హృద్యమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల విదేశాల్లో జరిగింది. వరుస విజయాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని గోపి కృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు ఎంతో భారీగా నిర్మిస్తున్నాయి. మొదట ఈ సినిమాకి జాన్ అనే టైటిల్ ని నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా టైటిల్ జాన్ కాదని, ఓ డియర్ అనే టైటిల్ కి సినిమా యూనిట్ మొత్తం దాదాపుగా ఓటు వేసిందని సమాచారం. 

 

వాస్తవానికి ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని మొన్నటి ఉగాది పండుగా కానుకగా రిలీజ్ చేద్దాం అని సినిమా యూనిట్ భావించిందట, కానీ కరోనా నేపథ్యంలో షూటింగ్స్ అన్ని కూడా ఇటీవల అర్ధాంతరంగా ఆగిపోవడంతో, తమ సినిమా షూట్ కూడా నిలిపివేయవలసి వచ్చిందని, దానితో ఇప్పటికిప్పుడు హడావుడిగా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం కంటే, కొద్దిరోజుల తరువాత పరిస్థితులు చక్కబడి షూటింగ్ మళ్ళి మొదలైన తరువాత వాటిని రిలీజ్ చేస్తే బాగుంటుందని యూనిట్ సభ్యులు నిర్ణయించారట. లేకపోతే ఈ పాటికే టైటిల్ ప్రకటన జరిగి ఉండేదని, అయితే రాబోయే మరొక నెల రోజుల్లోపు ఈ సినిమా టైటిల్ , ఫస్ట్ లుక్ అధికారికంగా బయటకు రావడం ఖాయం అని సమాచారం.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: