ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఎవరికైనా ఒక అవకాశం వచ్చి, దానిని వారు బాగా సద్వినియోగం చేసుకుని మంచి హిట్ కోడితే, ఆపై వారికి ఖచ్చితంగా వరుసగా అవకాశాలు వస్తాయి అని చెప్పడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. దానికి ప్రధాన కారణం నటీనటుల మధ్య విపరీతమైన పోటీ పెరిగిపోవడం అని, ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కి, మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ సినిమా పరిశ్రమకు వస్తున్న వారు మరింత ఎక్కువగా ఉంటున్నారని వారు అంటున్నారు. అలానే ఏదైనా సినిమా అవకాశం ఒకరిని వరిస్తుంది అని అంతా అనుకున్న సమయంలో చివరికి మరొకరి చేతికి చిక్కిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని వారు అంటున్నారు.ఇక ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ఒక టాలీవుడ్ టాప్ స్టార్ హీరో సినిమాలో మహానటి లో తన అత్యద్భుతమైన నటనకు గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అనుకున్న కీర్తి సురేష్ ని ఆల్మోస్ట్ ఫిక్స్ చేసిందట సినిమా యూనిట్. 

 

మొదట్లో ఆ హీరో సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఒకరు నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ హీరోతో ఇప్పటివరకు నటించని కీర్తికి, ఆల్మోస్ట్ ఈసారి అవకాశం రావడం జరిగిందని, అయితే హఠాత్తుగా ఆమె అవకాశాన్ని మరొక నటి అయిన రకుల్ గద్దలా తన్నుకుపోయిందని లేటెస్ట్ గా టాలీవుడ్ వర్గాల టాక్. అయితే దానికి ఒక ప్రధాన కారణం ఉందని అంటున్నారు. అదేమిటంటే, నిజానికి ఆ స్టార్ హీరో సినిమాలో కీర్తిని తీసుకోవాలని భావించి, ఈ లాకౌట్ తరువాత ఆమెను కలిసి సినిమా స్టోరీ వినిపిద్దాం అని సదరు దర్శకుడు ఫిక్స్ అయ్యాడట. అయితే అప్పటి వరకు ఆగడం కంటే ఒకసారి ఫోన్ చేసి విషయం చెపుదాం అని భావించి, ఫోన్ లో ఆమెకు ఈ సినిమా విషయమై పూర్తి వివరాలు చెప్పారట. 

 

అయితే తనకు రాబోయే కొన్ని నెలల వరకు తన కాల్ షీట్స్ ఫుల్ బిజీ కావడంతో తాను ఈ సినిమా చేయలేనని, దయచేసి తప్పుగా భావించవద్దని చెప్పిందట కీర్తి. విషయం అర్ధం చేసుకున్న దర్శకుడు, ఫైనల్ గా పలువురిని పరిశీలించిన అనంతరం రకుల్ అయితే ఆ క్యారెక్టర్ కి సెట్ అవుతుందని, అదీకాక ప్రస్తుతం ఆమెకు కేవలం నితిన్ సినిమా ఒక్కటే చేతిలో ఉండడంతో ఆమెనే తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. మరి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై సదరు సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావలసి ఉందని, అప్పటివరకు దీనిని విశ్వసించలేమని అంటున్నారు సినీ విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: