నటి పూజ హెగ్డే ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ సరసన జాన్, అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తొలిసారిగా నాగచైతన్య సరసన ఒకలైలా కోసం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి,ఆపై మెగాబ్రదర్ నాగబాబు తనయుడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఫస్ట్ మూవీ ముకుందాలో కూడా హీరోయిన్ గా నటించడం జరిగింది. అయితే ఆ రెండు సినిమాల్లో తన ఆకట్టుకునే అందం, అభినయంతో పూజా నటిగా మంచి పేరు దక్కించుకున్నప్పటికీ, అవి రెండు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయాన్ని అయితే అందుకోలేదు.
ఆపై కొంత గ్యాప్ తరువాత బన్నీ సరసన డీజే లో నటించిన పూజాకి ఆ సినిమా కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందించింది. ఇక 2018లో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన అరవింద సమేతతో పూజా విజయాల పరంపర మొదలైంది. ఇక ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో కలిసి ఆమె నటించిన మహర్షి, అలానే మరొక్కసారి వరుణ్ తేజ్ సరసన నటించిన గద్దలకొండ గణేష్, ఇక ఇటీవల అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాలతో వరుసగా నాలుగు విజయాలు అందుకున్న పూజా, ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అని చెప్పకతప్పదు.
ప్రస్తుతం తెలుగుతో పాటు అటు హిందీలో కూడా సినిమాలు చేస్తున్న పూజా, ఎక్కువగా సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఇక ప్రస్తుతం కొద్దిరోజులుగా కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్స్ అన్ని బంద్ కావడంతో పూజ కూడా ఇంటికే పరిమితం అయి, తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. ఇకపోతే నిన్న ఒక్కసారిగా మాస్టర్ చెఫ్ గా మారి, తన చేత్తో స్వయంగా చేసిన గజార్ హల్వా ఎంతో అదిరిపోయింది, మీరు కూడా రుచి చూడండి అంటూ ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అవునా మేడమ్, అయితే మాకు కూడా కొంచెం పెట్టండి, మేము కూడా మాస్టర్ చెఫ్ పూజా గారి వంటని రుచి చూడాలి అనుకుంటున్నాము అంటూ పలువురు ఆమె ఫ్యాన్స్ ఆ ఫోటోలపై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.....!!
View this post on InstagramMade my halwa and ate it too... ☺️ Gajar ka halwa by Masterchef pooja hegde 😃 🥕 #quarantinelife #kissthecook💋