బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం సినిమా మరోసారి తెలుగు సినిమా సత్తా చాటేందుకు వస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడు. 

 

400 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్యసినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే అది వైరల్ అవుతుంది. సినిమా నుండి రీసెంట్ గా రిలీజైన అల్లూరి సీతారామరాజు టీజర్ అదిరిపోయింది. మే 20న కొమరం భీమ్ ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ ఇద్దరి పాత్రలు చనిపోతాయట. రియల్ లైఫ్ లో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుకి అసలు పరిచయం లేదు. వాళ్లిద్దరూ కలుసుకున్నది కూడా లేదు. 

 

ఆ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్. రియల్ పాత్రలతో ఫిక్షన్ స్టోరీతో rrr వస్తుంది. అయితే క్లైమాక్స్ లో వాళ్ళు మరణించడం చూపిస్తే ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అక్కడ రాజమౌళి తీస్తున్నాడు కాబట్టి ఏం చేసినా అద్భుతంగానే ఉంటుంది. మరి rrr ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

 

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేస్తున్నారని తెలుస్తుంది. పాత్రల పరంగా నువ్వా నేనా అన్నట్టుగా నట విశ్వరూపం చూపిస్తున్నారని తెలుస్తుంది. బాహుబలి కాదు దాన్ని మించే సినిమాగా rrr అన్ని రికార్డులను చెరిపేసేందుకు సిద్ధం అవుతుంది. 2021 జనవరి 8న ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: