హీరోగా పరిచయమై కలిసి రాక విలన్ గా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన తర్వాత మళ్లీ హీరోగా మారిన నటుడు గోపీచంద్ ప్రస్తుతం వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. లౌక్యం సినిమా తర్వాత గోపీచంద్ చేసిన ఏ సినిమా కూడా విజయమ్ అందుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఏ ఒక్కటి కూడా కలిసి రావట్లేదు. అయినా కూడా గోపీచం ప్రయత్నాన్ని ఆపట్లేదు.

 

 

ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఏమైంది ఈ వేళ, రచ్చ సినిమాలని తెరకెక్కించిన సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాగా ఉంటుందట. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం కూడా విజయాన్ని దక్కించుకోలేదు. అయినప్పటికీ మళ్ళీ వీరి కాంబినేషన్లో సినిమా వస్తుంది. అయితే ఈ సారి గట్టి ప్రయత్నమే జరుగుతుందని సమాచారం.

 

 

కబడ్డీ బేస్ట్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది. తెలంగాణ ప్రాంత ఫీమేల్ టీమ్ కబడ్డీ కోచ్ గా తమన్నా కనిపిస్తుంటే, ఆంధ్రాప్రాంతానికి చెందిన మహిళల టీమ్ కోచ్ గా గోపీచంద్ కనిపిస్తున్నాడట. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ క్వీన్ గోపీచంద్ తో డాన్స్ చేస్తుందని సమాచారం. ఒకానొక స్పెషల్ నంబర్ కోసం బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా గోపీచంద్ తో నర్తిస్తుందట.

 

 

గ్రాండ్ మస్తీ హేట్ స్టోరీ వంటి హాట్ సినిమాల్లో కనిపించిన ఊర్వశి మొదటిసారిగా తెలుగులో గోపీచంద్ సరసన డాన్స్ చేయనుందట. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగులు క్యాన్సిల్ కావడంతో ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. లాక్ డౌన్ ముగియగానే త్వరగా షూటింగ్ కానిచ్చేసి తొందరగా విడుదల చేయడానికి రెడీ అవుతారట.  మొత్తానికి గోపీచంద్ అన్ని కమర్షియల్ హంగులతోనే వస్తున్నాడన్నమాట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: