బాహుబలి సినిమా ద్వారా ఇండియన్ సినిమా స్థాయి మరింత పెరిగింది. ప్రపంచ సినిమాకి ఇండియన్ సినిమా సత్తా ఏంటో చూపించింది. అప్పటివరకు ఎవరూ ఊహించని బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సాధించడమే కాదు.. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే ఎంత బడ్జెట్ సినిమా తీసయినా రికవరీ తెచ్చుకోవచ్చనే నమ్మకాన్ని తెచ్చిపెట్టింది. బాహుబలి స్ఫూర్తితో హిందీలో చాలా సినిమాలే వచ్చాయి.

 

 

కానీ అవేమీ బాహుబలిలా విజయం సాధించలేదు. ఒక్క బాలీవుడ్ లోనే కాదు దక్షిణాదిన సైతం బాహుబలి స్ఫూర్తితో చాలా సినిమాలు వచ్చాయి. పాన్ ఇండియా రేంజ్ తమని తాము నిరూపించుకోవడానికి ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. అయితే వాటిల్లో ఎక్కువ మందిని ఆకట్టుకున్న చిత్రం కేజీఎఫ్. కన్నడ చిత్ర పరిశ్రమలో రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.

 

 

ఈ  సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుందో అందరికీ తెలిసిందే. హీరో ఎలివేషన్ సీన్లతో పిచ్చెక్కించింది. అమ్మ సెంటిమెంట్, పదునెక్కించే డైలాగులతో మతి పోగొట్టింది. అయితే ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రీకరణ కరోనా కారణంగా వాయిదా పడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారమ్ ప్రకారం కేజీఎఫ్ 2 ఎండింగ్ విషాదంగా ఉండనుందట.

 

 

మొదటి పార్ట్ లో రాకీభాయ్ పాత్ర విలన్లందరినీ గడగడలాడించింది. మరి అంతటి ఎలివేషన్లున్న ఆ పాత్ర ముగింపు విషాదంగా ఉంటే అభిమానులు తట్టుకోగలరా అన్న సందేహం కలుగుతుంది. దసరా కానుకగా విడుదల అవుతున్న కేజీఎఫ్ 2 సినిమా గురించి అందరూ ఎదురుచుస్తున్నారు. మరి అంతమంది ఎదురుచూస్తున్న సినిమాలోని పవర్ ఫుల్ పాత్రని విషాదంగా ముగిస్తే ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: