టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఇప్పుడు నెంబర్ వన్ పొజీషన్లో కొనసాగుతున్నాడు.  కృష్ణ వారసులుగా రమేష్ బాబు, మహేష్ బాబు ఇద్దరు వచ్చినప్పటికీ మహేష్ బాబు హీరోగా కొనసాగుతున్నాడు.  ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా వచ్చాడు.  తాజాగా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నారు.  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్   కుమారుడు  గ‌ల్లా అశోక్  హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.  నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ భిన్న త‌ర‌హా ఎంట‌ర్‌టైన‌ర్‌కు శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు.

 

అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్యా, అర్చ‌నా సౌంద‌ర్య కీల‌క పాత్ర‌ధారులు.   ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో అన్ని సినిమా షూటింగ్స్ వాయిదా వేసిన విషయం తెలిసిందే.   మరికొన్ని సినిమా మూవీ ల రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు.  తాజాగా ఈ సినిమాకు సంబంధించి 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో  సినిమా షూటింగ్ నిలిచిపోయింది.

 

తాజాగా అశోక్ గల్లా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టేబుల్‌పై కూర్చొని టేబుల్‌  ల్యాంప్ వెలుగులో  పుస్త‌కం చ‌దువుతున్న అశోక్ లుక్ ఆక‌ట్టుకుంటోంది.   ఈ సందర్భంగా నిర్మాత ప‌ద్మావ‌తి మాట్లాడుతూ.. లాక్‌డౌన్ నేప‌థ్యంలో అంద‌రూ ఇళ్ల‌ల్లో సుర‌క్షితంగా ఉండాల‌ని కోరారు. ప్ర‌భుత్వాలు, డాక్ట‌ర్లు, పోలీసులు చెబుతున్న స‌ల‌హాలు, సూచ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటిస్తూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి కట్టడిలో భాగ‌స్వాములు కావాల‌న్నారు.  కృష్ణ‌, గ‌ల్లా అరుణ‌కుమారి సంయుక్తంగా స‌మ‌ర్పిస్తోన్న ఈ మూవీ చంద్ర‌శేఖ‌ర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, జిబ్రాన్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.  ఈ మూవీతో అశోక్ గల్ల తన ఎంత వరకు విజయం సాధిస్తాడో చూాడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: