చిరంజీవి న‌టించిన చిత్రం `సైరా`తో హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి `ఆచార్య‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు స్వ‌యంగా చిరు ఓ ప్ర‌స్‌మీట్‌లో అనుకోకుండా వెల్ల‌డించారు. క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, కొర‌టాల స్నేహితుడు నిరంజ‌న్‌రెడ్డి క‌లిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

ఇప్ప‌టికే దాదాపుగా 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌స్తుతం అంద‌రూ లాక్ డౌన్ లో ఉండ‌టం తో అన్ని సినిమాలు షూటింగ్‌ల‌న్నీ ఆగిపోయాయి. ఈ నేప‌ధ్యంలోనే ఆచార్య షూటింగ్ కూడా ఆపేసి స్వియ నిర్బంధ‌న‌లో ఉన్నారు చిరంజీవి. దీంతో చిరు `ఆచార్య‌` షూటింగ్‌ని కూడా మ‌ధ్య‌లోనే ఆపేయాల్సి వ‌చ్చింది. ఇందులో చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా న‌టిస్తున్నారు. కీల‌క అతిథి పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ నటించ‌బోతున్నాడు. అయితే ఈ పాత్ర‌లో మ‌హేష్ న‌టిస్తాడ‌ని, ఈ పాత్ర కోసం భారీగానే పారితోషికం ఆశించ‌డంతో ఆ పాత్ర‌ని మ‌ళ్లీ రామ్‌చ‌ర‌ణ్ చేతే చేయించాల‌ని చిరు నిర్ణ‌యించుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఈ విష‌యం పై మాత్రం ఇంకా స‌రైన క్లారిటీ మాత్రం ఈ చిత్ర యూనిట్ ఇంకా ఇవ్వ‌లేదు.

 

అయితే ఆ వార్త‌ల్లో నిజం లేదంటున్నారు చిరు. ఈ పాత్ర కోసం అస‌లు మ‌హేష్‌ని అడ‌గ‌నేలేద‌ని వెల్ల‌డించి కొత్త‌గా ఆయ‌న ఒక‌ షాకిచ్చాడు. ముందు నుంచి ఈ పాత్ర కోసం రామ్‌చ‌ర‌ణే అనుకున్నామ‌ని స్ప‌ష్టం చేశాడు. ఇక రామ్‌చ‌ర‌ణ్ డేట్స్ అడ్జ‌స్ట్ చేయాల‌ని ఆ బాధ్య‌త‌ రాజ‌మౌళిపైనే వుంద‌ని అస‌లు ట్విస్ట్ ఇచ్చాడు. రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్నాడు. అది పూర్త‌యితే కానీ రామ్‌చ‌ర‌ణ్ ఫ్రీకాడు. త‌ను ఫ్రీ కావాలంటే రాజ‌మౌళి గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వాలి. ఇక రాజ‌మౌళి మాత్రం ఈ చిత్రంలో ఆయ‌న న‌టించ‌డం వ‌ల్ల ఆ సినిమా పై క్రేజ్ త‌గ్గుద‌ని ఆలోచిస్తున్నారో ఏమో మ‌రి ఆయ‌న ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: