టాలీవుడ్ దర్శకులలో అతి వేగంగా సినిమాలు తీయడమే కాకుండా హీరోలను తన మాటలతో బుట్టలో పెట్టే నేర్పు ఉన్న దర్శకుల లిస్టులో పూరీ జగన్నాథ్ అగ్రస్థానంలో ఉంటాడు. అయితే ఆమధ్య వరస పరాజయాలు రావడంతో పూరీ మాటలకు బుట్టలో పడే విషయంలో టాప్ హీరోలు చాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


క్రితం సంవత్సరం విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ అయినా మన టాప్ టాప్ హీరోలు మాత్రం ఇస్మార్ట్ సక్సస్ ను ఫ్లూక్ హిట్ గా పరిగణిస్తున్నట్లు టాక్. దీనితో పూరీ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో తీస్తున్న మూవీ సక్సస్ ను బట్టి పూరితో సినిమాలు చేసే విషయమై ఆలోచిద్దామని చాలామంది టాప్ హీరోల భావన అని అంటున్నారు. 


కరోనా సమస్య వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో పూరి జగన్నాథ్ ఖాళీగా ఉండలేక తయారు చేసిన ఒక పవర్ ఫుల్ స్టోరీని ఈమధ్యనే పూరీ బాలకృష్ణకు ఫోన్ ద్వారా చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఈ కథ బాలయ్యకు నచ్చడంతో బోయపాటి మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత ఖచ్చితంగా ఈ సినిమాను చేద్దామని ఈలోపున విజయ్ దేవరకొండ తో చేస్తున్న మూవీ పూర్తి అయిన తరువాత మళ్ళీ కలుద్దామని పూరీకి బాలయ్య మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.


దీనితో మరింత రెట్టించిన ఉత్సాహంతో పూరి తాను బాలయ్యను దృష్టిలో పెట్టుకుని రాసిన కథకు మరింత తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘జన గణ మన’ అన్న టైటిల్ తో ఒక కథను పుచ్చుకుని మహేష్ చుట్టూ ఆ తరువాత ఈమధ్య పవన్ చుట్టూ కూడ వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే కథను కొద్దిగా మార్పులు చేసి తన మాటలతో బాలయ్యను బుట్టలో పడేసుకున్నాడా అంటూ బాలయ్య అభిమానులు భయపడిపోతు గతంలో వచ్చిన ‘పైసా వసూల్’ ప్రయోగం రిపీట్ అవుతుందా అంటూ గగ్గోలు పెడుతున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: