కరోనా  దెబ్బతో ఆల్రెడీ రిలీజ్ డేట్ ఇచ్చిన సినిమాలు వెనక్కి వెళ్లాయి. ఇలా కరోనా దెబ్బకి పోస్ట్ పోన్ చేసుకున్న సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేద్దాం ..? ఆ టైమ్ కి వేరే సినిమాలు ఏం అడ్డొస్తాయి.. ? అసలు ఏం టైమ్ లో రిలీజ్ చేస్తే  కష్టాలను గట్టెకుతాం..? అని తలలు బద్దలుకొట్టుకుంటున్నారు  అందరూ.

 

థియేటర్లులేక, షూటింగులు లేక.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సినిమాలన్నీ ఇప్పుడు  ఆ సినిమాల్ని ఎప్పుడు రిలీజ్ చేద్దామా అని తెగ టెన్షన్ పడుతున్నాయి. అలాంటి పరిస్తితుల్లో చాలా సినిమాలున్నాయి. ఏప్రిల్ 2 న వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ ఉప్పెన సినిమాని విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి సినిమాను మే ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారట.

 

నిజానికి ఈ  ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో 4 సినిమాల రిలీజ్ పెట్టుకున్నారు. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యాక వస్తున్న ఈ సినమాలపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలా అంచనాలతో రిలీజ్ అవ్వాల్సిన సినిమా రానా హీరోగా ప్రభు సాల్మన్ డైరెక్షన్లో తెరకెక్కిన అరణ్య. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని  ప్యాన్ ఇండియా లెవల్లో ఏప్రిల్ 2 న రిలీజ్ చేస్తున్నట్టు  అనౌన్స్ చేసింది టీమ్. కానీ.. మా సినిమా కన్నా మీ ప్రాణాలే ముఖ్యం అంటూ.. కరోనా ఎఫెక్ట్ తో డేట్ పోస్ట్ పోన్  చేసుకున్నారు.

 

అనుష్క, మాధవన్ లీడ్ రోల్ లో హేమంత్ మధుకర్ డైరెక్షన్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ నిశ్శబ్దం.  అనుష్క మూగఅమ్మాయి పాత్రలో నటిస్తున్న ఈ ఇంట్రస్టింగ్ సినిమా జనవరిలో రిలీజ్ అవ్వాల్సి ఉంది.కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగాల్సి ఉండడంతో ఏప్రిల్ 2 నరిలీజ్ అని చెప్పారు. కానీ  ఈ సినిమా కూడా ధియేటర్ల బంద్ తో రిలీజ్ వాయిదా వేసుకుంది.

 

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టోరీ. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫీల్ గుడ్  సినిమాకు కూడా కరోనా సెగ తగిలింది.  ఏప్రిల్ 2 న రిలీజ్ చేద్దామనుకున్న ఈ సినిమాని ఏకంగా మే కి పోస్ట్ పోన్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: