బాలీవుడ్ సింగ్ కనికా కపూర్.. ఎట్టకేలకు కరోనా బారి నుంచి బయటపడింది. లక్నోలోని సంజయ్గాంధీ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందిన ఆమె సోమవారం డిశ్చార్జ్ అయ్యింది. దీంతో బాలీవుడ్ ప్రముఖులందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆరో సారి పరీక్షలు నిర్వహించగా ఆమెకు కరోనా నెగెటివ్ రావడంతో ఆమెను వైద్యులు డిశ్చార్జి చేశారు. విదేశాల నుంచి వచ్చిన కనికాకపూర్ హోం క్వారంటైన్లో ఉండకుండా పలు పార్టీలకు హాజరైన విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా లక్నోలో నిర్వహించిన పార్టీకి ఆమె హాజరు అయింది. అయితే.. ఇదే పార్టీకి పలువురు ఓమంత్రి, ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు, తదితర ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే.. ఒకటిరెండురోజుల్లోనే కనికాకపూర్ పరీక్షలు చేయించుకోగా.. కొవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆమెతోపాటు పార్టీకి హాజరైన వారందరూ వెంటనే హోం క్వారంటైన్లోకి వెళ్లారు. తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కనికా కపూర్ నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.
ఒక దశలో సోషల్ మీడియాలో కనికాకపూర్ వ్యవహారం వైరల్గా మారింది. చివరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కూడా పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందనే టాక్ కూడా వినిపించింది. ఈ క్రమంలో కనికాకపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అనేక ఊహాగానాలు వినిపించాయి. ఒక దశలో ఆమె శరీరం చికిత్సకు సహకరించడం లేదని, ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. దీంతో బాలీవుడ్ ప్రముఖులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. అప్పటికీ పలు మార్లు పరీక్షలు నిర్వహించినా పాజిటివ్ అని రావడంతో ఇక కనికాకపూర్ కోలుకోవడం కష్టమేననే టాక్ బలంగా వినిపించింది. కానీ.. కరోనా వైరస్ నుంచి ఆమె అనూహ్యంగా కోలుకుంది. ఆరోసారి నిర్వహించిన పరీక్షల్లో కనికా కపూర్కు నెగెటివ్ అని తేలడంతో ఎట్టకేలకు ఆమె ఊపిరిపీల్చుకుంది. ఆమె వైద్యులు సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇదిలా ఉండగా.. కనికా కపూర్ కోలుకోవడంపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తాను బాధ్యతాయుతంగా ఉండకుండా..నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇంతటి పరిస్థితి ఎదురైందనే భావనలో కనికాకపూర్ ఉన్నట్లు తెలుస్తోంది.