టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల విషయంలో ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో హీరోలు అందరూ కూడా కమర్షియల్ గా ఆలోచించడం మొదలుపెట్టారు. ప్రతీ సినిమా కూడా కమర్షియల్ గా ఉండే విధంగానే ప్లాన్ చేస్తున్నారు హీరోలు. సినిమా హిట్ ఫ్లాప్ కంటే కూడా కమర్షియల్ గా ఉంటే బాలీవుడ్ లో కూడా ఆడుతుంది అనేది హీరోల ఎక్కువ నమ్మకం. అందుకే కథల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 

 

కథ ఎలా ఉన్నా సరే వసూళ్లు వస్తాయని భావించి స్టార్ హీరోలు అందరో కూడా కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఇప్పుడు టాలీవుడ్ హీరో ఒకరు ఇలాగే ఆలోచిస్తూ బాలీవుడ్ హీరోతో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేసే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ మల్టీ స్టారర్ సినిమాలో సల్మాన్ ఖాన్ అని టాక్. సల్మాన్ తో కలిసి సదరు హీరో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ హీరో ఎవరో కాదు మహేష్ బాబు. 

 

సల్మాన్ ఖాన్ ని తన సినిమాలో ఒక 20 నిమిషాల పాటు చూపించే ఆలోచనలో మహేష్ ఉన్నాడని టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. మహేష్ ప్రస్తుతం పరుశురాం తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రకు గానూ మహేష్ బాబు సల్మాన్ ఖాన్ ని కోరినట్టు సమాచారం. అయితే అది విలన్ పాత్ర అని అంటున్నారు. మరి ఎంత వరకు నిజమో గాని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుంది. అందులో దీన్ని కూడా ప్రస్తావిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: