టాలీవుడ్ లో ఇప్పుడు మహేష్ బాబు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అగ్ర దర్శకులతో పాటుగా చిన్న చిన్న దర్శకులకు కూడా అవకాశాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న దర్శకుల సినిమాలకు ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమా హిట్ అయిన దర్శకుడు ఉంటే కమర్షియల్ కథలను రెడీ చెయ్యాలని మహేష్ బాబు డైరెక్ట్ గా చెప్తున్నాడు. అందులో భాగంగానే పరుశురాం తో సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. 

 

సినిమా కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన ఒక లుక్ ని కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు మహేష్ బాబు ఎక్కువగా కంగారు పడుతున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆయన కొన్ని కొన్ని చిన్న చిన్న సినిమాల మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

అందుకే మహేష్ బాబు ఇప్పుడు ఎక్కువగా కంగారు పడుతున్నారని అలాగే ఆయన ఒక దర్శకుడికి అడ్వాన్స్ కూడా ఇచ్చారని ఈ అడ్వాన్స్ ని వేరే నిర్మాతతో కలిసి మహేష్ బాబు ఇచ్చారని సమాచారం. అయితే దానికి వడ్డీ పెరుగుతుంది అని కంగారు పడుతున్నాడు. అలాగే ఇప్పుడు మహేష్ బాబుకి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా నిర్మాతగా మహేష్ బాబుని బాగా ఇబ్బంది పెట్టింది. అందుకే ఇప్పుడు వేగంగా సినిమాలు చేయడానికి మహేష్ బాబు ప్రయత్నాలు చేస్తున్నాడు. కరోనా వలన మహేష్ కి ఇప్పుడు నష్టం వస్తుందని భావిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: